తెలుగు సినీ పరిశ్రమలో నీరుగారిపోయిన జీవితాన్ని, ముంబైలో అమ్మడు స్థిర పరుచుకుంది.  ‘రాజు గారి గది’ సినిమాతో ఇండస్ట్రీకి పెద్ద షాకే ఇచ్చాడు యాంకర్ టర్న్డ్ డైరెక్టర్ ఓంకార్. అంతకుముందు ‘జీనియస్’ అనే చెత్త సినిమాను అందించిన ఓంకార్.. అంత పెద్ద హిట్ కొడతాడని ఎవరూ అనుకోలేదు. నిజానికి ఇదేమంత ప్రత్యేకమైన సినిమా కాకపోయినా.. ఆ సమయానికి అనూహ్యంగా ఆడేసింది. ఈ ఊపులో నాగార్జున, సమంతల్ని పెట్టి ‘రాజు గారి గది-2’ తీశాడు.

 

తరువాత ఆ జానర్‌ను వదలకుండా ‘రాజు గారి గది-3’ అనౌన్స్ చేశాడు. కానీ సినిమా ప్రారంభమైన కొన్ని రోజులకే ఈ చిత్రం నుంచి లీడ్ యాక్టర్ తమన్నా తప్పుకుంది. తనకు చెప్పిన కథకు, తీస్తున్న కథకు సంబంధం లేకపోవడంతోనే తమన్నా తప్పుకుందని అంటున్నారు. కారణాలేవైనప్పటికీ తమన్నా తప్పుకున్న మాట మాత్రం వాస్తవం.

 

ఇప్పుడు తమన్నా స్థానంలో ఎవరిని తీసుకోవాలన్న అయోమయంలో పడిపోయాడు ఓంకార్. స్టార్ హీరోయినే అయ్యుండాలి. వివిధ భాషల్లో తెలిసుండాలి. మంచి పెర్ఫామర్ అయ్యుండాలి. సమంత ఆల్రెడీ ‘రాజు గారి గది-2’లో చేసింది కాబట్టి దీంతో చేయలేదు. కాజల్ ఇలాంటి సినిమాకు సెట్టవ్వదు. దీంతో ఓంకార్ చూపులు తాప్సి మీద పడ్డాయట.

 

కానీ తాప్సి ఓంకార్ లాంటి దర్శకులు తీసే ఆషామాషీ కథలు ఒప్పుకునే స్థితిలో లేదు. బాలీవుడ్లో ఆమె చేస్తున్నవన్నీ టాప్ క్లాస్ సినిమాలు. గత కొన్నేళ్లలో దక్షిణాదిన ‘ఆనందో బ్రహ్మ’, ‘గేమ్ ఓవర్’ మాత్రమే చేసింది. అవెంత కొత్తగా ఉంటాయో తెలిసిందే. ఓంకార్ ఆ స్థాయి కథతో సినిమా తీస్తాడన్న ఆశలు ఎవరికీ లేవు. కాబట్టి వీళ్లు అడిగినా తాప్సి ‘రాజు గారి గది-3’ చేయడానికి ఒప్పుకోవడం సందేహమే.


మరింత సమాచారం తెలుసుకోండి: