టాలీవుడ్ హీరో, పొలిటిషియన్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్‌లో అభిమానులున్నారో కొత్తగా చెప్పనక్కర్లేదు. పవన్‌ కూడా అదే స్థాయిలో వారి కష్ట, సుఖాలు తెలుసుకుంటూ అందర్నీ కలుస్తుంటారు. మరీ ముఖ్యంగా ఎవరైనా అభిమాని కష్టాల్లో ఉన్నాడని తెలిసినా.. కార్యకర్తలెవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తన దృష్టికి వస్తే చాలు పవన్ చలించిపోతుంటారు. ఆ కష్టాల నుంచి అభిమానులను గట్టెక్కించడానికి శాయశక్తులా పవన్ ప్రయత్నాలు చేస్తుంటారన్న సంగతి ఇప్పటికే చాలాసార్లు ప్రూవ్ అయింది.

అయితే.. ఈ సేవలన్నీ పవన్ ఇప్పట్నుంచి కాదు ఎప్పట్నుంచో మొదలెట్టారన్న సంగతి మాత్రం చాలా తక్కువమందికి తెలుసు. సినిమాలకు దూరమైనప్పటికీ.. ఆ సేవా భావాన్ని మాత్రం ఆయన ఇంకా కొనసాగిస్తున్నారు. ఇక రీసెంట్‌గా విజయనగరం, ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు అభిమానులకు పవన్ తనవంతుగా సాయం చేసి వాళ్లను కష్టాలనుంచి గట్టెక్కించడానికి ప్రయత్నించారు.

విజయనగరంకు చెందిన విశ్వతేజ అనే కార్యకర్త క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు పార్టీలోని కొందరు ముఖ్య కార్యకర్తలు, ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా తెలుసుకున్న పవన్ చలించిపోయారు. ఈ విషయంపై ఆరాతీసిన జనసేనాని.. వెంటనే అతనికి వైద్య ఖర్చుల నిమిత్తం రెండు లక్షల రూపాయల చెక్‌ను పంపారట. ఇదిలా ఉంటే.. అనారోగ్యంతో మంచానికి పరిమితమైన ఖమ్మం జిల్లాకు చెందిన గుబ్బాల సతీష్ పరిస్థితి పవన్ దృష్టికి వెళ్లడంతో.. ఆ యువకుడికి కూడా తన సిబ్బంది ద్వారా లక్ష రూపాయల చెక్‌ను అందజేశారు. పవన్ హెల్పింగ్ నేచర్‌ను చూసిన నెటిజన్లు ఇందుకేనేమో జనసేనాని అంటే ఫ్యాన్స్ ఇంతలా పడిచచ్చిపోతారని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక రీసెంట్‌గా ఎన్నికల్లో పరాజయాన్ని చూసిన పవన్ మళ్ళీ సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నట్టు సన్నిహితుల ద్వారా అందిన సమాచారం. అదే గనక నిజమైతే ఫ్యాన్స్ కి మళ్ళీ పండగే. 



మరింత సమాచారం తెలుసుకోండి: