యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తరువాత చేస్తున్న చిత్రం ‘సాహో’. ఈసినిమాపై మొదటినుండి అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ప్రస్తుతం సాంగ్స్ షూటింగ్ కోసం టీం అంత ఫారిన్‌కు వెళ్లారు. ఆస్ట్రియాలో ప్రభాస్ - శ్రద్ధ కపూర్ ల మధ్య డ్యూయట్ సాంగ్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ప్రభాస్ ఆస్ట్రియాలో జరుగుతున్న షూటింగ్ కి సంబంధించి ఒక ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ లో  పోస్ట్ చేసాడు.

 

అయితే ఈసినిమాను నిర్మిస్తున్న ‘యువి క్రియేషన్స్’ సినిమాను ప్రమోట్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు అనే చెప్పాలి. సినిమాకి సంబంధించి అప్ డేట్స్ ఇవ్వడంలో కూడా యువి వారు ఫెయిల్ అవుతున్నారు. కొన్నికొన్ని సార్లు అయితే అభిమానులు సహనానికి పరీక్ష పెడుతున్నారు.ఒక దశలో అభిమానులు యువి వాళ్ల ఆఫీస్ ముందు ఆందోళన చేసే పరిస్థితి కూడా వచ్చింది. రిలీజ్ విషయం లో లేటెస్ట్ గా క్లారిటీ వచ్చింది. ఆగస్టు 15 న ఈమూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు.

 

అంత బాగానే ఉంది కానీ ఈమూవీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది మాత్రం క్లారిటీ లేదు. నిజానికి ఈమూవీకి మొదట శంకర్-ఎహసాన్-లాయ్. వీరు సడన్ గా ఈసినిమా నుండి తప్పుకోవడంతో ఇటీవలే జిబ్రాన్ ఈ చిత్రానికి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇస్తాడని మాత్రం కన్ఫమ్ చేశారు. అయితే బాలీవుడ్ సంగీత త్రయం ఈ సినిమా నుండి ఎందుకు తప్పుకున్నారనేది ఇంతవరకు తెలియదు. మొన్న రిలీజైన టీజర్ కి నేపథ్య సంగీతం జిబ్రాన్ ఇచ్చాడని తెలిసిందే.

 

కానీ సాంగ్స్ ఎవరితో కంపోజ్ చేయించారో మాత్రం చెప్పడంలేదు. సాంగ్స్ కూడా జిబ్రాన్ తోనే కంపోజ్ చేయిస్తున్నారా? లేదా వేరే ఎవరితో అయినా చూపిస్తున్నారా? అనేది తెలియాల్సిఉంది. అయితే ‘యువి’ దీనిపై క్లారిటీ ఇవ్వడం లేదు. మరి ఎందుకని వారు దీన్ని ఇంత సీక్రెట్ గా ఉంచుతున్నారో తెలియడం లేదు. పాటల చిత్రీకరణ జరుగుతుంది కానీ అవి ఎవరు కంపోజ్ చేసారనేది చెప్పడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: