హీరో పాత్ర నుండి ఇప్పుడు క్యారెక్టర్ పాత్రల వైపు యూటర్న్ తీసుకున్న  రాజేంద్రప్రసాద్ ప్రస్తుతం కెరీర్ పరంగా పీక్స్ ని చూస్తున్నాడు. ప్రస్తుతం  క్యారెక్టర్ ఆర్టిస్టుగా క్షణం తీరిక లేనంత బిజీగా కొనసాగుతూ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న చాలా భారీ సినిమాలలో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. 

ఈ పరిస్థితులలో రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో నటించిన ‘ఓ బేబి’ రేపు విడుదల కాబోతోంది. ఈసినిమాలోని ఆసక్తికర విషయాలను తెలియచేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కొడుకు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు లీక్ చేసాడు. ఇండస్ట్రీలోని ప్రముఖ నటుల వారసులు అంతా ఫిలిం ఎంట్రీ ఇస్తున్న నేపధ్యంలో తన వారసుడు ఎంట్రీ ఎప్పుడు అన్న విషయమై షాకింగ్ రిప్లయ్ ఇచ్చాడు. 

తన కొడుకు బాలాజీ ప్రసాద్ వయసు ఇప్పుడు 35 ఏళ్ళు అని చెపుతూ ఇలాంటి వయసులో హీరో ఏమిటి అంటూ జోక్ చేసాడు. అంతేకాదు రామోజీ రావు తన కొడుకుతో తమ సొంత బ్యానర్ లో ఒక మంచి సినిమాను తీయాలని ఎంత పట్టుపట్టినా తన కొడుకు బాలాజీ తనకు నటన ఇష్టం లేదు అని తప్పించుకున్న విషయాలను తెలియచేసాడు. 

దీనితో తన కొడుకుకి ఇష్టం లేకుండా నటుడుని అవ్వమని బలవంత పెట్టలేదనీ ఒత్తిడితో ఏవ్యక్తి ఏరంగంలోనూ రాణించలేడు అన్న అభిప్రాయం వ్యక్తపరిచాడు. ప్రస్తుతం తన కొడుకు బాలాజీ మద్రాసుతో అనుబంధం కొనసాగిస్తూ అక్కడ ఉంటున్నాడని అదేవిధంగా ఆస్ట్రేలియాతో రకరకాల బిజినెస్ లు చేస్తూ ఎక్స్ పోర్ట్ బిజినెస్ మేన్ గా రాణించాలని ప్రయత్నిస్తున్నాడు అంటూ రాజేంద్ర ప్రసాద్ ఇప్పటి వరకు ఎవరికీ తెలియని తన కొడుకు సీక్రెట్ ను బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు..   



మరింత సమాచారం తెలుసుకోండి: