ప్రభాస్ సాహో సినిమా మీద ఎన్ని అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమా టీజర్ కోసం అభిమానులు చాలా కాలం ఎదురు చూసారు. మొత్తానికి టీజర్ వచ్చేసింది. టీజర్ అదిరిపోయింది. యాక్షన్ సీక్వెన్సెస్ తో టీజర్ ని నింపేశారు. ఇందులో ప్రభాస్ చెప్పే "డై హార్డ్ ఫ్యాన్స్" అనే డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే తాజాగా మరో వార్త ప్రభాస్ అభిమనులను ఉత్సాహ పరచనుంది.

 

"సాహో" ప్రచారం మొదలైంది. త్వరలో ఈ సినిమాలోని తొలి పాట "సైకో సయ్యాన్" విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ సినిమా సంగీతంపై కూడా ఒక స్పష్టత వచ్చింది. "సాహో" పాటలను ముగ్గురు నలుగురు సంగీత దర్శకుల చేత చేయించి ఉంటారని స్పష్టమవుతుంది. ఈ చిత్రానికి తమిళ సంగీత దరశకుడు నేపథ్య సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.

 

పాటలు మాత్రం ఆయన ఇవ్వడం లేదు. తొలి పాటకు హిందీ సంగీత దర్శకుడు తనిష్ బగ్చి సంగీతం అందించారు.  ఇంతకు ముందు తెలుగులో రాజ్ తరుణ్ లవర్ చిత్రంలో ఒక పాటకు సంగీతం అందించారు. మళ్ళీ ఇప్పుడు సాహోతో తెలుగు సంగీత ప్రయుల మూదుకి వస్తున్నాడు. పాటలు అన్నీ తనిష్క్ ఒక్కడే చేసాడా? ఇద్దరు ముగ్గురు లేదా నలుగురు చేసారా అనేది త్వరలో తెలుస్తుంది.

 

ప్రస్తుతానికి చిత్రబృందం కూడా సంగీత దర్శకత్వం ఎవరు చేసారు అనేది హైలెట్ చేయడం లేదు. పాట విడుదల అవుతుందని మాత్రమే ప్రకటించారు. కానీ ఎవరు సంగీతం చేసారు అనేది చెప్పలేదు. ఒకటి మాత్రం నిజం బాలీవుడ్ త్రయం శంకర్ -ఎహ్ సాయ్ -లాయ్ తప్పుకున్న తర్వాత పాటలు చక చక చేయించుకున్నారని అర్థమవుతుంది. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: