గతంలో వరుస విజయాలతో దూసుకెళ్లి పోయిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం వరుస ఫ్లాపులతో ఇండస్ట్రీలో కెరీర్ ని నెట్టుకొస్తున్నాడు. తీస్తున్న సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో నిర్మాతలు కూడా పూరి జగన్నాథ్ తో సినిమాలు చేయడానికి ముందుకు వాని సమయంలో తానే నిర్మాతగా వ్యవహరిస్తూ సినిమాలు చేస్తూ ఒక్క హిట్ కోసం నానా తంటాలు పడుతున్నాడు.


ప్రస్తుతం ఎనర్జిటిక్ హీరో రామ్ తో ‘ఇస్మార్ట్ శంకర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి పూరి జగన్నాథ్ నిర్మాత అయిన నేపథ్యంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాను 20కోట్ల లోపే ఫినిష్ చేశారు . అయితే ఆ మొత్తం థ్రియేటికల్ రైట్స్ ద్వారా వెనక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డిజిటల్ - శాటిలైట్ రూపంలో పూరికి 14కోట్లు రికవర్ అయినట్లు సమాచారం.


ఇక సినిమా ఏ మాత్రం క్లిక్కయినా లాభాలు మొదలవుతాయి. దీంతో పూరి జగన్నాథ్ సేఫ్ జోన్ లో పడినట్టే అని అంటున్నారు ఇండస్ట్రీకి చెందినవారు. మరోపక్క ఈ సినిమాకి హీరోయిన్ చార్మి కూడా డబ్బులు పెట్టిన క్రమంలో ఏ మాత్రం హిట్ టాక్ సొంతం చేసుకున్న గత కొంత కాలం నుండి హీరో రామ్ కి కూడా విజయాలు లేని నేపథ్యంలో అందరి జీవితాలు ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మారిపోయినట్టే అని ఇండస్ట్రీలో ఉన్న వారు అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: