ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్. టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ లో పలువురు ఇతర భాషల నటులు కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక బాహుబలి రెండు భాగాల సూపర్ హిట్స్ తరువాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రస్తుతం ఆకాశాన్ని అంటేలా అంచనాలు ఉన్నాయి. ఇక అంతే భారీ లెవల్లో అత్యున్నత సాంకేతిక విలువలతో సినిమాని తెరకెక్కిస్తున్నారు యూనిట్ సభ్యులు. 

ఇక నేడు మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు జయంతిని పురస్కరించుకుని ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ తమ సినిమా షూటింగ్ అప్ డేట్ ఇచ్చింది. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతుందని, అయితే చిన్న బ్రేక్ తీసుకున్న తరువాత వచ్చేవారం హీరోలు చరణ్, ఎన్టీఆర్ తిరిగి షూటింగ్లో పాల్గొంటారని తెల్పింది. ఇక మరోవైపు దర్శకుడు రాజమౌళి అమెరికాకు వెళ్లడం జరిగింది. అయితే తానా ఆధ్వర్యంలో సంగీత దర్శకుడు కీరవాణి మ్యూజిక్ కన్సర్ట్ అమెరికాలో జరుగుతుండడంతో ఆయన దానికోసం అక్కడికి వెళ్లారని అందరు అనుకోవడంతో, అదేమీ కాదు, తాను కేవలం పర్సనల్ పనిమీదనే వాషింగ్టన్ రావడం జరిగిందని రాజమౌళి ట్వీట్ చేస్తూ చెప్పారు ఇక అక్కడికి వెళ్లిన సమయంలో కొందరు సన్నిహితులతో రాజమౌళి ఆర్ఆర్ఆర్ కథపై చర్చించి వారికి కథ ఎలా ఉండబోతోంది అనే హింట్ ఇవ్వడం జరిగిందట. 

నిజానికి ఈ కథ కొంత సాధారణమైనది అయినప్పటికీ, రాజమౌళి గారు తెరకెక్కిస్తున్న విధానాన్ని బట్టి చూస్తే ఇది తప్పకుండా ఆయన  కెరీర్ లో మరొక బ్లాక్ బస్టర్ అవుతుందని విన్నవారు చెపుతున్నారట. ఇక ప్రస్తుతం మీడియా మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తపై ఎక్కడా ఎటువంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ ఈ వార్త విన్న పలువురు సినిమా సూపర్ డూపర్ హిట్ కావడం ఖాయమని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిలో నిజానిజాలు తెలియాల్సి ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: