సూపర్ స్టార్ మహేశ్ బాబు తన కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించాడు. ఒక సినిమాకు తరువాత సినిమాకు ఎలాంటి సంబంధం లేకుండా చూసుకునేవాడు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా మహేశ్ బాబు కేవలం సమాజానికి సందేశం ఇచ్చే సినిమాలు మాత్రమే చేస్తున్నాడు. మధ్యలో వేరే సినిమాలు చేసినా అవి డిజాస్టర్లు కావటంతో మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలకు మాత్రమే ప్రాధాన్యమిస్తున్నాడు మహేశ్ బాబు. 
 
శ్రీమంతుడు సినిమాతో మహేశ్ బాబు ఇలాంటి సినిమాలు చేయటం ప్రారంభించాడు. ఆ సినిమా తరువాత వచ్చిన బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాలు డిజాస్టర్లుగా మిగిలాయి. ఆ సినిమాలు డిజాస్టర్లు కావటంతో కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను అనే మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా చేసాడు. ఆ సినిమా తరువాత మహర్షి సినిమాకు కూడా ఇదే ఫాలో అయ్యాడు. కానీ మహర్షి విషయంలో కొన్ని సీన్లు, ఫైట్లు, మహేశ్ బాబు నటన శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాల్లోని కొన్ని సీన్లను గుర్తుకు తెచ్చే విధంగా ఉన్నాయనే విమర్శలు ఎదుర్కొన్నాడు మహేశ్ బాబు. 
 
ప్రస్తుతం మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కథ గురించి ఎలాంటి సమాచారమైతే లేదు. మహేశ్ బాబు వరుసగా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తే మాత్రం ప్రేక్షకులు మొనాటనీ ఫీలయ్యే అవకాశం ఉంది. కొన్ని సంవత్సరాలపాటు మహేశ్ బాబు ఇలాంటి కథలకు దూరంగా ఉంటే మంచిదేమో 



మరింత సమాచారం తెలుసుకోండి: