‘ధడక్’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి కూతురు జాహ్నవి తనకు వచ్చిన  అవకాశాలు అన్నీ ఒప్పుకోకుండా తనకు నచ్చిన పాత్రలను మాత్రమే చేస్తోంది. ఈనేపధ్యంలో ఆమె లేటెస్ట్ గా కరణ్ జోహార్ నిర్మిస్తున్న ‘దోస్తానా 2’ లో హీరోయిన్ గా ఎంపిక అయింది. 

2008 లో ప్రియాంక చోప్రా జాన్ అబ్రహాం అభిషేక్ బచన్ లు నటించిన ‘దోస్తానా’ సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు ఆమూవీకి సీక్వెల్ తీస్తున్నారు. ఈ సందర్భంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాహ్నవి మాట్లాడుతూ ఈమూవీలో హోమో సెక్సువాలిటీ విషయం చర్చించడం మంచి పరిణామం అని చెపుతూ ఈవిషయమై ప్రస్తుత తరం వారికి ఒక అవగాహన ఉండటం అవసరం అన్న అభిప్రాయం వ్యక్త పరిచింది. 

వాస్తవానికి ఈసున్నితమైన అంశాన్ని చాల ఫన్నీగా ఈమూవీలో చెప్పబోతున్న విషయాలను వివరిస్తూ ఈవిషయమై ఉన్న అపోహాలను కూడ తొలిగించవలసిన అవసరం ఉంది అంటూ జాహ్నవీ కపూర్ అభిప్రాయపడుతోంది. దాదాపు 11 సంవత్సరాల తరువాత నిర్మింపబడుతున్న ఈ సీక్వెల్ లో ఇద్దరు హీరోలు ఒక హీరోయిన్ ఉంటారని తెలుస్తోంది. 

సామాజిక సమస్యలను హాస్యంతో రంగరించి సినిమాలను తీస్తే బాలీవుడ్ ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. దీనితో ఈమూవీని కూడ భారీ బడ్జెట్ లు లేకుండా వాస్తవవిక కోణంలో అందరికీ నచ్చే విధంగా కరణ్ జోహార్ నిర్మించబోతున్నట్లు బాలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది. తన ఇమేజ్ గురించి పట్టించుకోకుండా చాల రియలిస్టిక్ కోణంలో ఉండే పాత్రలను అంగీకరిస్తూ గ్లామర్ హీరోయిన్ గా కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకోవాలని జాహ్నవి చాల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: