కోలీవుడ్ లో యంగ్ హీరోలకు పోటీగా ఇప్పటికీ తన స్టైల్ తో అభిమానులను ఉర్రూతలూగిస్తున్న హీరో సూపర్ స్టార్ రజినీకాంత్. హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఆయన వరుసగా సినిమాల్లో నటిస్తున్నారు.  లింగ మూవీ నుంచి మొన్నటి ‘పేట్టా’ వరకు విభిన్నమైనా పాత్రలతో ప్రేక్షకులను ఎంట్రటైన్ చేస్తున్నారు.  ప్రస్తుతం ఆయన స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్భార్’మూవీ లో నటిస్తున్నారు.  దాదాపు సగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈసినిమా పై వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి. 

ఈ మూవీలో రజినీ సరసన నయనతార నటిస్తుంది.  ఇది ఆమెకు రెండో సినిమా కావడం విశేషం. కోలీవుడ్ కెరీర్ బిగినింగ్ రజినీతో ‘చంద్రముఖి’సినిమాలో నటించింది.   కాగా ఈమూవీ లో ఓ కీలక పాత్ర క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి ‘యోగ్‌ రాజ్ సింగ్’ నటిసున్నారు.   ఈ పాత్ర సెకండాఫ్ లో వస్తుందట.. భారీ ఫైట్ సీక్వెన్స్ లో యోగ్‌ రాజ్, రజినితో కలిసి ఫైట్ చేయనున్నారట.  యోగ్ రాజ్ కూడా ఒకప్పుడు క్రికెటర్ అందుకే ఆయన తనయుడు యువ్ రాజ్ సింగ్ ని క్రికెటర్ అయ్యేలా ప్రోత్సహించారు. 

క్రికెట్ నుంచి రిటైర్ మెంట్ తీసుకున్న తర్వాత సినిమాల్లో నటిస్తున్నారు యోగ్ రాజ్. రజిని ఈచిత్రంలో కూడా ఫుల్ ఎనర్జీ తో కనిపించనున్నాడు.  అనిరుద్ రవిచంద్రన్ సంగీతం సినిమాకి హైలైట్ గా నిలవనుంది. ఒక ముఖ్య పాత్ర నివేత థామస్ నటిస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈచిత్రం ని రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: