సమంత హీరోయిన్ గా చేస్తున్న ఓ బేబీ మూవీ రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్నది.  సినిమాకు పాజిటివ్ వైబ్ క్రియేట్ కావడంతో అంచనాలు పెరిగాయి.  పైగా అందరికి కనెక్ట్ అయ్యే కథ ఇందులో ఉందని, దాని కోసమే సినిమా చేశానని సమంత చెప్పడం ఒక విషయమైతే.. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించడం మరో విశేషం.  


సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఇటీవల కాలంలో చిన్న సినిమాలను ప్రోత్సహిస్తోంది.  ఇంటి ఆడపడుచు సమంత సినిమాను వదులుకుంటుందా చెప్పండి.  అందుకే ఆ కుటుంబం అంతా ఆమెకు అండగా ఉండి ప్రమోషన్ చేశారు.  ఎలాగైతేనేం రేపు మూవీ రిలీజ్ కాబోతున్నది.  


కొరియాలో మిస్ గ్రానీ సంచలనం సృష్టించింది.  అదే విధంగా సమంత సినిమా కూడా సంచలన విజయం సాధిస్తుందని నమ్ముతున్నారు.  ఇందులో అన్ని సీన్స్ బాగున్నాయని సమంత ఇంటర్వ్యూలో చెప్పింది.  ఎమోషన్ సీన్స్ ను సమంత అద్భుతంగా చేస్తుంది.  అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు.  


కానీ, ఈ మూవీలో క్లైమాక్స్ లో వచ్చే ఎమోషన్ సీన్ చేయడానికి చాలా కష్టపడింది.  సీన్ చూసుకున్నాక కనీసం రెండు గంటల పాటు మౌనంగా కూర్చుండిపోయింది.  అంతా ఒకే చేయగలను అనుకున్నాకే సీన్ చేసినట్టు సమంత చెప్పింది.  తనకు ఈ కథ బాగా కనెక్ట్ అయ్యిందని చెప్పుకొచ్చింది.  సమంతకు కనెక్ట్ అయ్యింది సరే అందరికి అలా కెనెక్ట్ అవుతుందా చూద్దాం.  


మరింత సమాచారం తెలుసుకోండి: