జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను ఇకపై సినిమాలు చేయనని ఫుల్ టైం పొలిటీషియన్ గానే ఉంటాన‌ని అని ఇప్పటికే పలుసార్లు చెప్పాడు. పవన్ ఈ మాట అన్యాపదేశంగా చెప్పిన నా ఎంతవరకు మాటపై నిలబడ‌తాడు అన్నది మాత్రం అందరికీ సందేహంగానే ఉంది. ప‌వ‌న్‌కు నిజంగా ప్ర‌జాసేవ‌పై అంత జిజ్ఞాశ ఉంటే... నిజంగానే ప్ర‌జ‌ల కోస‌మే పోరాడితే ఆయ‌న‌కు ఖ‌చ్చితంగా విజ‌యం ఉంటుంది. 


ప‌వ‌న్ ఫుల్ టైం పొలిటిషీయన్‌గా ఉండం ఓకే గాని... అంత‌కు ముందు ఇద్ద‌రు, ముగ్గురు నిర్మాత‌ల నుంచి సినిమాలు చేస్తాన‌ని భారీగా అడ్వాన్స్‌లు తీసుకున్నాడ‌ట‌. ఇప్పుడు ఇవి ఎంత‌కు తిరిగి ఇచ్చే ప‌రిస్థితి లేద‌ని తెలుస్తోంది. అజ్ఞాత‌వాసి అట్ట‌ర్ ప్లాప్‌. ప్ర‌స్తుతం సినిమాలు చేయ‌నంటున్నాడు. చేస్తే మాట త‌ప్పిన‌వాడు అవుతాడు ? అలాంట‌ప్పుడు ఆ అడ్వాన్స్‌లు ఇచ్చేస్తే లెక్క బాగుంటుంది. 


హారిక హాసిని, మైత్రీ, ఇలా మరో ఒకటి రెండు అడ్వాన్స్ లు పవన్ దగ్గర వున్నాయని వినికిడి. వీరిలో మైత్రీ అమౌంట్ బాగా ఎక్కువే అట‌. ఇక శ్రీసూర్య మూవీస్ అధినేత ఏఎం.ర‌త్నం కూడా అడ్వాన్స్ ఇచ్చార‌న్న టాక్ ఉంది. ఈ లెక్క‌న ఈ సినిమాలు చేసే స్కోప్ లేదు. ఇప్ప‌టికే 50కు ద‌గ్గ‌ర‌వుతోన్న వేళ ప‌వ‌న్ సినిమాకు ఇంత గ్యాప్ ఇచ్చి చేస్తే జ‌నాలు చూస్తారా ? అన్న డౌట్ కూడా ఉంది. మ‌రి ఇప్పుడైనా తాను తీసుకున్న అడ్వాన్స్‌లు ఇస్తాడా ?  లేదా ? అంతేనా అన్న‌ది చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: