సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల తన 25వ సినిమా మహర్షితో సూపర్ డూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా తరువాత తన 26వ సినిమాని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయన్ను మహేష్ బాబు, అతి త్వరలో ఆ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ బాబు, అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. 

ఇకపోతే ఇప్పటికే గత కొద్దిరోజులుగా మహేష్ బాబు 27వ సినిమా పై పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. కొందరేమో అర్జున్ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించిన సందీప్ రెడ్డి దర్శకత్వంలో మహేష్ నటించనున్నారని అంటుంటే, మరికొందరేమో గీత గోవిందం దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో నటించనున్నారని అంటున్నారు. అయితే ఇటీవల సందీప్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తదుపరి సినిమా కోసం ఇప్పటికే మహేష్ గారికి ఒక స్టోరీ లైన్ వినిపించడం జరిగిందని, అతి త్వరలో దాని పూర్తి స్క్రిప్ట్ వినిపించి, అయన అనుమతితో షూటింగ్ మొదలెట్టాలని చూస్తున్నట్లు తెలిపారు. 

ఇకపోతే  దర్శకుడు పరశురామ్ కూడా మహేష్ కోసం ఒక మంచి ఎంటర్టైనింగ్ కథ సిద్ధం చేసాడని, ఆ పాయింట్ ఇటీవల మహేష్ కు చెప్పడం ఆయనకు నచ్చడం జరిగిపోయిందట. ఇక ఆల్మోస్ట్ ఆ సినిమా ఓకె అయినట్లేనని, అంతేకాక తన తదుపరి సినిమా తప్పకుండా మహేష్ బాబుతోనే ఉంటుందని పరశురామ్ తన సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తల్లో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజుల్లో ఆగవలసిందే....!!


మరింత సమాచారం తెలుసుకోండి: