ఇటీవల బాహుబలి సిరీస్ రెండు సినిమాలతో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్న ప్రభాస్, ప్రస్తుతం నటిస్తున్న భర్తీ బడ్జెట్ మూవీ సాహో. దాదాపుగా రూ.250 కోట్లకుపైగా ఖర్చుతో రూపొందుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ లోనే కాక దేశవ్యాప్తంగా అన్ని సినిమా ఇండస్ట్రీల్లో మంచి అంచనాలున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్, సినిమా పై అంచనాలను ఆకాశమే హద్దుగా పెంచేసిందని చెప్పాలి. 

ఇక రన్ రాజా రన్ తో మంచి హిట్ సాధించిన దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని యువి క్రియేషన్స్ బ్యానర్ పై ప్రభాస్ స్నేహితులు వంశీ, ప్రమోద్ నిర్మిస్తుండడం విశేషం. ఇకపోతే మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలని దర్శకనిర్మాతలు కొంత ఆలోచనలో పడ్డారట. అయితే చివరికి తాము ఎంపికచేసిన శ్రద్ధ కపూర్ డేట్స్ లభించడంతో ఆమెనే హీరోయిన్ గా ఫిక్స్ చేయడం జరిగింది. ఇక ఇప్పటివరకు పలు బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి పేరు సంపాదించిన శ్రద్ధ, ఈ సినిమాతో టాలీవుడ్ కి ఫస్ట్ టైం హీరోయిన్ గా పరిచయం అవుతుండడంతో ఆమెకు కూడా ఎంతో సంతోషంగా ఉందట. 

ఎందుకంటే, తోలి సినిమానే బాహుబలి ప్రభాస్ సరసన చేయడం, అది కూడా ఇంత పెద్ద భారీ బడ్జెట్ సినిమా కావడంతో, తప్పకుండా తాను చేస్తున్న ఈ ఫస్ట్ సినిమా టాలీవుడ్ కి బెస్ట్ సినిమా అవుతుందన్న నమ్మకం తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేస్తోందట. వాస్తవానికి అదివరకు కూడా కొన్ని టాలీవుడ్ సినిమాల్లో శ్రద్ధను తీసుకోవాలని పలువురు నిర్మాతలు భావించినప్పటికీ, ఆమె డేట్స్ లభ్యం కాకపోవడంతో అది కుదరలేదు. మరి రేపు సాహో విడుదల తరువాత టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న శ్రద్ధ ఎంతమేర హిట్ అందుకుంటుందో చూడాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: