నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంతా అక్కినేని ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'ఓ బేబీ'.  నాగశౌర్య.. లక్ష్మి.. రాజేంద్ర ప్రసాద్.. రావు రమేష్ ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  ఈ సినిమా రేపు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.  దీంతో 'ఓ బేబీ' టీమ్ ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉంది.  ఈ ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా సమంతా.. నందిని ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.  ఈ ఇంటర్వ్యూ లో రామ్ చరణ్ సతీమణి ఉపాసన తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేశారు.

 

ఈ ఇంటర్వ్యూ చేసిన వారు గంగవ్వ.  ఈ గంగవ్వ 'మల్లేశం' సినిమాలో ఒక కీలక పాత్రలో నటించి అందరినీ మెప్పించిన సంగతి తెలిసిందే.  గంగవ్వ తనదైన శైలిలో ప్రశ్నలు అడిగి సమంతా.. నందిని నుండి సమాధానాలు రాబట్టడంతో ఈ ఇంటర్వ్యూ యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది. "సినిమాల్లో మీరు వేరేవాళ్లు తాళి కడతారు కదా .. మీ భర్త ఏమీ అనరా?" అని గంగవ్వ  అడిగితే  "ఇలాంటి ప్రశ్న ఏ ఇంటర్వ్యూలోనూ అడగలేదు. మంచి ప్రశ్న.. సినిమాల్లో రెండే ముళ్లు వేస్తారు .. మూడో ముడి వేయరు" అని సమంతా చాలామందికి తెలియని విషయాన్ని వెల్లడించింది.

 

"మరి మాకు సినిమాల్లో మూడు ముళ్లు వేసినట్టు కనిపిస్తుంది" అని అడిగితే.. నందిని రెడ్డి సమాధానమిస్తూ "ఒకటే ముడిని మూడుసార్లు చూపిస్తారు" అంటూ గంగవ్వకు క్లారిటీ ఇచ్చింది. "మీ అత్తగారిని మీరు మంచిగా చూసుకుంటారా లేకాపోతే మీ అత్తగారే మిమ్మల్ని మంచిగా చూసుకుంటారా? అని సమంతాను అడిగితే "ఇద్దరం ఒకరిని ఒకరు మంచిగా చూసుకుంటాం"అని చెప్పింది.

 

"మీ భర్తను ఎంత పెట్టి కొనుకున్నారు?" అని అడిగితే "కట్నమా.. చాలా ఇచ్చా"(అంటూ గంగవ్వ చెవిలో 'ఎంతో' చెప్పింది)..   ఆశ్చర్యపోయిన గంగవ్వ "అన్ని పైసలిచ్చి కొన్నారా?" అని అడిగింది. "మరి అంత పెద్ద ఫ్యామిలీ కదా?" అని సమంతా తిరిగి కౌంటర్ ఇచ్చింది.  పెళ్లి టాపిక్ ను నందిని కంటిన్యూ చేస్తూ "నేను ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనుకున్నావ్.. నా దగ్గర అన్ని పైసల్లేవు" అంటూ సరదాగా చెప్పింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: