ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ‘ఓ బేబి’ సినిమా రిజల్ట్ గురించి సమంతతో పాటు ఫిలిం ఇండస్ట్రీ వర్గాలు కూడ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఈసినిమా విజయం కోసం సమంత కూడ విపరీతంగా ప్రమోట్ చేస్తూ అనేక మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ నేపధ్యంకో ఈమూవీ రిజల్ట్ గురించి ఆమె ఎంత టెన్షన్ పడుతోంది అన్న విషయాన్ని ప్రతిబింబించేలా ఆమె నిన్న ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఉన్నాయి.

తాను ఇప్పటి వరకు ఎందరో టాప్ హీరోలతో ముఖ్యంగా మహేష్ జూనియర్ చరణ్ అల్లు అర్జున్ లతో నటించినా ఆసినిమాల గురించి తానెప్పుడు టెన్షన్ పడలేదనీ టాప్ హీరోల ఇమేజ్ బట్టి సినిమాలకు ఓపెనింగ్ కలక్షన్స్ వస్తాయని అంటూ కామెంట్ చేసింది. అయితే ‘ఓ బేబి’ విషయంలో అంతా తన భుజాల పై మోస్తూ తన శక్తికి మించిన బరువును ఎత్తుకున్నాను అంటూ ఆమె ఈమూవీ విజయం పై తనకు ఉన్న టెన్షన్ ను బయట పెట్టింది. 

దీనికి తగ్గట్టుగానే ఈమూవీ నిడివి రెండు గంటల నలబై నిముషాలు ఉన్న నేపధ్యంలో ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాను సగటు ప్రేక్షకుడు అంతసేపు ఎటువంటి విసుకులేకుండా చూస్తాడా అన్న ఆసక్తి ఇండస్ట్రీ వర్గాలలో విపరీతంగా ఉంది. అయితే అనుష్క నటించిన ‘అరుంధతి’ ‘భాగమతి’ లాంటి సినిమాలు పెద్ద నిడివితో ఉంటూ అంతా హీరోయిన్ చుట్టూ తిరిగినా సూపర్ హిట్ అయిన నేపధ్యంలో ‘ఓ బేబి’ కూడ ఖచ్చితమైన విజయం సాధిస్తుంది అని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.

ఈసినిమాకు 21 కోట్ల ఖర్చుతో తీసి సుమారు 30 కోట్ల వరకు బిజినెస్ చేసారు అని వార్తలు వస్తున్నాయి. దీనితో కేవలం సమంత మ్యానియాను ఆధారంగా చేసుకుని ఈమూవీ విజవంతం అవ్వాలి అంటే ప్రపంచ వ్యాప్తంగా సుమారు 40 కోట్ల నెట్ కలక్షన్స్ రాబట్టాలి ఇలాంటి టెన్షన్ వల్ల కాబోలు సమంత ఈ భారాన్ని తాను మోయలేకపోతున్నాను అంటూ ఓపెన్ గా కామెంట్ చేసింది..


మరింత సమాచారం తెలుసుకోండి: