ప్రస్తుతం హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కలయికలో రూపొందుతున్న కొత్త సినిమా ఇస్మార్ట్ శంకర్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్ సినిమా పై అంచనాలు అమాంతం పెరిగాయి. రామ్ సరసన నిధి అగర్వాల్, నభ నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తుండగా, పూరి తన సొంత బ్యానర్ పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్ పై నటి ఛార్మితో కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. 

ఇక ట్రైలర్ లో రామ్ తెలంగాణ స్లాంగ్ లో పలికిన డైలాగులు, యాక్షన్ సీన్స్ లో ఆయన నటన అందరిని బాగా ఆకట్టుకుంటోంది. ఇక మరొక రెండు రోజుల్లో వరంగల్ జిల్లా హన్మకొండలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని బోనాలు పేరుతో ఎంతో గ్రాండ్ గా ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని అంటోంది సినిమా యూనిట్. ఇకపోతే ఈ ఈవెంట్ కి టాలీవుడ్ లోని ఒక స్టార్ హీరో ప్రత్యేక అతిథిగా రాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. 

ఇదివరకు పూరి ఆ స్టార్ హీరోతో గతంలో సినిమాలు తీసారని, కాబట్టి పూరి అడగడంతో ఆ హీరో వెంటనే ఫంక్షన్ కు వస్తానని మాటిచ్చారట. ఇక ప్రస్తుతం ఈ వార్త పుకారవుతుండడంతో ఆ స్టార్ హీరో ఎవరై ఉంటారని ఇప్పటికే పలు మీడియా వేదికల్లో చర్చలు మొదలయ్యాయి. అసలు ఇంతకీ పుకారవుతున్న ఈ వార్త లో నిజానిజాలు తేలాలంటే ఈనెల 7వ తేదీ వరకు వేచి చూడాల్సిందే....! 


మరింత సమాచారం తెలుసుకోండి: