ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి వైరల్ న్యూస్ లు ఎక్కువే అవుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రెటీలపై ఏ చిన్న వార్త ఉన్నా క్షణాల్లో వైరల్ అవుతూ తలనొప్పిగా మారిపోతున్నాయి. వాటికి మాకు సంబంధం లేదు మోర్రో అన్నా అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది.  తాజాగా కొంత కాలంగా టాలీవుడ్ లో మెగాస్టార్ నటిస్తున్న ‘సైరా’మూవీపై రక రకాల రూమర్లు పుట్టుకు వస్తున్నాయి.

మెగాస్టార్ తన కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 151 సైరా సినిమా అక్టోబర్ 2న రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా రాంచరణ్ నిర్మాతగా ఉన్నారు. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తవుతున్నాయి. అయితే మెగాటీమ్ డబ్బింగ్ విషయంలో జోక్యం చేసుకోవడం.. అతి చేస్తుండడం దర్శకుడు సురేందర్‌రెడ్డికి తీవ్రమైన అసహనం కలిగిస్తోన్నట్టు రాసుకొచ్చారు‌.

అంతే కాదు ఈ మూవీ రీ షూటింగ్ తర్వాత కొన్ని సీన్లు స్వయంగా మెగాస్టార్ అలా చేస్తే బాగుంటుంది..ఇలా చేస్తే బాగుంటుందని జోక్యం చేసుకోవడం సురేందర్ రెడ్డి అప్పటికే అనుకున్న సీన్లు మార్చడం ఇలా ఎన్నో ఇబ్బందులు కలిగించారని వార్తలు వచ్చాయి. 

తాజాగా ఈ వార్తలపై స్పందించిన మెగాస్టార్ సెట్ లో ఓ సీనియర్ నటుడిగా గా  ఏదన్నా సలహాలు ఇవ్వటంలో తప్పులేదని..అంతే కానీ దర్శకుడిని ఇబ్బంది కలిగించే పని తాను ఎప్పుడూ చేయనని..అలా చేస్తే తన కెరీర్ ఇంత వరకు వచ్చేదే కాదని అన్నారు.  ఇలాంటి రూమర్స్ ఎవరికైనా కోపం తెప్పిస్తాయని, సినిమాపై నెగిటివ్ తీసుకొస్తాయని ఆయన అభిప్రాయపడుతున్నారట. 


మరింత సమాచారం తెలుసుకోండి: