వరుస పరాజయాలతో సతమతమవుతున్న హీరో "కళ్యాణ్ రామ్". పటాస్ తర్వాత ఒక్క హిట్టు కూడా పడలేదు. మొన్న వచ్చిన 118  సినిమా కొంత ఫర్వాలేదనిపించినా, పటాస్ స్థాయి హిట్ మాత్రం రాలేదు. అయితే ప్రస్తుతం కళ్యాణ్ రామ్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. "శతమానం భవతి" చిత్ర దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది.

 

శతమానం భవతి సినిమా ఎంత  సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి జాతీయ అవార్డు కూడా వచ్చింది. శతమానం భవతి తర్వాత సతీష వేగేశ్న నితిన్ తో "శ్రీనివాస కళ్యాణం " చేశాడు. కానీ అది అనుకున్నంత విజయం సాధించలేదు. ఇప్పుడు ఈ  దర్శకుడు నందమూరి హీరోతో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా స్క్రిప్టు పనులు ఆల్రెడీ పూర్తయ్యాయి. త్వరలో షూటింగ్ జరుపుకోనుంది.

 

ఫ్యామిలీ డ్రామాల్ని ఎంటర్ టైనింగ్ గా తీసే దర్శకుడు సతీష్ వేగేశ్న ఇప్పుడు కళ్యాణ్ రామ్ తో కలిసి మరో ఫ్యామిలీ కథని చూపించబోతున్నాడట. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన మెహరీన్ కథానాయికగా  నటిస్తుంది.  ఈ సినిమాకి "ఎంత మంచి వాడవురా" అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసారు. ఆల్రెడీ ఫ్యమిలీ ఫాలోయింగ్ దర్శకుడు ఇలాంటి టైటిల్ పెట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు.

 

వరుసగా పరాజయల్ని చూసిన కళ్యాన్ రామ్ మరి ఈ కుటుంబ కథా చిత్రంతో విజయం అందుకుంటాడో చూడాలి. కళ్యాణ్ రామ్ ఇది వరకు ఫ్యామిలీ డ్రామాలు చేసి ఉన్నాడు. కానీ అవేవీ "పటాస్" అంతటి విజయాన్ని అందుకోలేదు. ఈ సినిమాకి సంబంధించి ఇతర సాంకేతిక వర్గం, తారాగణం తదితర విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: