సమంత ముఖ్య పాత్రలో నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన సినిమా "ఓ! బేబి . ఈ సినిమా జులై 5 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో సమంత బిజీగా ఉంది. సమంత మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించిన ఆసక్తి కరమైన విషయాలు వెల్లడించింది. ఓ!  బేబి నా కెరీర్ లో ప్రత్యేక చిత్రం  అందిరకీ కనెక్టయ్యే మంచి కథలో కనిపించాలన్న తాపత్రయం వుంది. అందుకే ఈ ‘బేబీ’పై ఎక్కువ కేర్ తీసుకున్నా.

 

మజిలీ విషయంలో ఎంత ఫోకస్‌తో ఉన్నానో, ఈ ప్రాజెక్టుపైనా అలానే ఉన్నా. కారణం -మజిలీ పెళ్లయ్యాక చేసిన సినిమా. అదీ చైతూతో కలిసి. అందుకే కాస్త ఎక్కువ బాధ్యత తీసుకోక తప్పలేదు. చైతన్య సినిమాల విడుదల టైంలోనే నేను తిరుపతికి వెళ్లేదాన్ని. కానీ ఇపుడు నా కెరీర్‌లో తొలిసారి నా సినిమా కోసం తిరుపతి వెళ్ళాను. మాములుగా సినిమా బాగా వచ్చింది. మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటివారైతే థియేటర్స్‌కు జనాలు ఆటోమేటిగ్గా వచ్చేస్తారు.

 

ఎంత స్టార్ హీరోయిన్ అయినా థియేటర్‌కు జనాలను రప్పించడం మామూలు విషయం కాదు. అందుకే నావంతు నేను విపరీతంగా పబ్లిసిటీ చేస్తున్నా. థియేటర్‌కు వచ్చినవారికి మాత్రం తప్పకుండా నచ్చే సినిమా ఇది. ఎందుకంటే టీజర్, ట్రైలర్ ఇప్పటికే అందరికీ నచ్చింది.మామూలుగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అనగానే థ్రిల్లర్ చిత్రాలో, మెసేజ్ ఓరియెంటెడ్ కథలో వస్తాయి. కానీ ఇందులో మెసేజ్ ఉంటుంది. అయితే అది పూర్తిగా కామెడీతో మనసుకు హత్తుకునేలా సాగుతుంది. అందుకే ఈ సినిమా నాకు స్పెషల్.

 

ఆమెని పిల్లల గురించి ఏం ప్లాన్ చేస్తున్నారని అడిగితే,అందులో ఏముంది? నేను కూడా నా ఫ్రెండ్స్‌ని పిల్లల గురిం ఏం ప్లాన్ చేసుకున్నారని అడుగుతా. భగవంతుడి దయవల్ల నేను స్వతంత్రంగా ఉండగలుగుతున్నా. నాకు ఈ ఏడాది పిల్లలువద్దని చెప్పగలుగుతున్నా. ఆ పరిస్థితి మన అమ్మకో, అమ్మమ్మకో ఉండేదా? వాళ్లకసలు జీవితంలో ఎలాంటి కోరికలు ఉండేవి? వాటిని నెరవేర్చడానికి వారు ఎప్పుడైనా ప్రయత్నించారా? వంటి ప్రశ్నలన్నీ మనకు ఓ బేబి చూశాక కలుగుతాయి అంటూ చెప్పుకొచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: