తెలుగులో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు హీరో శ్రీకాంత్. శ్రీకాంత్ హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చాలా పాత్రలు చేసాడు. ఏ పాత్ర చేసినా తనదైన ముద్ర వేస్తుంటాడు. దాదాపుగా శ్రీకాంత్ చేసిన అన్ని సినిమాలు కుటుంబ కథా చిత్రాలే. కుటుంబ కథా చిత్రాల్లో ఆయన్ని ఓన్ చేసుకోవడమే దీనికి కారణం. ఖడ్గం లాంటి సినిమాలో మాస్ పాత్రలు చేసినప్పటికీ, ఆయనకి కుటుంబ కథా చిత్రాల్లో ఉన్న ఫాలోయింగే వేరు.

 

ప్రస్తుతం శ్రీకాంత్ గారు హీరోగా సినిమాలు చేయడం తగ్గించారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకి నచ్చిన పాత్రలు చేస్తున్నారు. "సరైనోడు " సినిమాలో అల్లు అర్జున్ కి బాబాయి గా నటించి మంచి మార్కులు కొట్టేసారు.  ఆ సినిమా తర్వాత మళ్ళీ చెప్పుకోదగ్గ పాత్రలో కనిపించలేదనే చెప్పాలి. " తెలంగాణ దేవుడు" సినిమా చేసినప్పటికీ ఆ సినిమా ఎప్పుడు రిలీజైందో కూడా తెలీని పరిస్థితి.

 

ఇదిలా ఉండగా శ్రీకాంత్ నుండి తాజాగా "మార్షల్" అనే సినిమా వస్తుందని అన్నారు. అక్కడక్కడా పోస్తర్లు కూడా కనిపించాయి. అయితే ఆ సినిమా సంగతి కూడా ఇంతవరకు తెలియదు. శ్రీకాంత్ ప్రస్తుతం, ఒక సినిమాలో అతిథి పాత్రలో కనిపించబోతున్నాడట. ఈ సినిమా కథ నచ్చి నటించడానికి ఒప్పుకున్నాడట శ్రీకాంత్. "ఎర్రచీర" అనే సినిమాలో శ్రీకాంత్  అతిథి పాత్రలో కనిపించనున్నాడు.

 

శ్రీ సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సత్య సుమన్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. హారర్‌, యాక్షన్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్‌ కీలక పాత్ర పోషించడం విశేషం. దర్శకుడు సుమన్‌బాబు మాట్లాడుతూ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న కుటంబ కథా చిత్రమిది. శ్రీరాం.. అలీ పాత్రలు ఆకట్టుకుంటాయి. ఛేజింగ్‌ సన్నివేశాలు హైలెట్‌గా నిలుస్తాయి.  ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్‌ మొదటివారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: