తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ కి మంచి క్రేజ్ వచ్చిన విషయం తెలిసిందే.  ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకొని మూడో సీజన్ రాబోతుంది. బిగాబాస్ సీజన్ 1 కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హూస్ట్ గా వ్యవహరించగా ఈ షో చాలా సరద సరదాగా గడిచిపోయింది.  బిగ్ బాస్ 1 విన్నర్ గా శివబాలాజీ నిలిచారు. 

 

ఇక బిగ్ బాస్ సీజన్ 2 మాత్రం ఎన్నో కాంట్రవర్సీలు.. రోజూ ఏదో ఒక ఉత్కంఠ..ఒకదశలో అసలు బిగ్ బాస్ హౌజ్ లో ఇంత దారుణంగా ఉంటుందా అన్న స్థితిలో ముగిసింది.  మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 2 కి కౌశల్ విన్నర్ గా నిలిచారు..రన్నరప్ గా సింగర్ గీతా మాధురి నిలిచింది.

 

తాజాగా గీతామాధురి బిగ్ బాస్ గురించి సంచలన పోస్ట్ చేసింది.  బిగ్ బాస్ 2 ముగిసినప్పటి నుంచి ఎంతో మంది బిగ్ బాస్ హౌజ్ లో ఎలా ఉంటుంది..నిజంగానే తిట్టుకోవడం..కొట్టుకునే వరకు వెళ్లడం ఉంటుందా? అని రక రకాల ప్రశ్నలు వేస్తున్నారని..అలాంటి వారందరికీ ఒక్కటే సమాధానం అంటూ పోస్ట్ చేసింది. 

 

బిగ్ బాస్ లో పాల్గొన్నంత మాత్రా అందరూ శత్రువుల్లా ఉండరని, షోలో పోటీదారుల ప్రవర్తనను చూసి వారిని జడ్జ్ చేయకూడదని గీతామాధురి చెప్పింది. బిగ్ బాస్ లో పోటీ అనేది ఉంటుందని..ఎవరైనా గెలుపొందాలనే చూస్తారని, అలాంటపుడు షోలో గేమ్ స్ట్రాటజీలు ఉంటాయని.. షోలో వారు ఎదుర్కొనే పరిస్థితులను బట్టి ప్రవర్తన మారుతుంటుందని చెప్పుకొచ్చింది. 

 

అంతే కానీ రియల్ లైఫ్ లో ఎవరూ అలా ఉండరని..అందరం సన్నిహితంగా స్నేహపూర్వకంగానే ఉంటామని చెప్పింది. షోలో ఉన్నంత వరకే మీకు అలా కనిపిస్తామని..షో నుండి బయటకి వచ్చిన తరువాత తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని వెల్లడించింది. త్వరలోనే బిగ్ బాస్ 3 కూడా మొదలుకాబోతుందని.. ఇప్పుడు గొడవల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. బిగ్ బాస్ లో పాల్గొనేవారందరికీ గుడ్ లక్ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: