ఇటీవల కొన్నాళ్ల క్రితం టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పేరుతో కొందరు అమ్మాయిలను మధ్యవర్తులు అవకాశాలు ఎరజూపి లొంగతీసుకుంటున్నారని, అటువంటి వారిని కఠినంగా శిక్షించి నటులుగా అవకాశం కోసం వచ్చే అమ్మాయిలకు రక్షణ నివ్వాలని, ముఖ్యంగా తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ లో అవకాశాలు కల్పించాలని కోరుతూ మా అసోసియేషన్ ముందు వర్ధమాన నటి శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో పెను దుమారం రేపిన శ్రీ రెడ్డి వివాదం, ఆ తరువాత కొంతవరకు సయోధ్యతో ముగిసింది. 


అయితే ఆపై ఆమె టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను పవన్ ఫ్యాన్స్ కు, ఆమెకు మధ్య పెద్ద మాటల యుద్ధమే జరిగింది. ఇక అనంతరం ఇటీవల తన మకాం ని కొన్నాళ్ళ క్రితం చెన్నైకి మార్చిన శ్రీరెడ్డి, ఇప్పటికీ కూడా అప్పుడపుడు తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కొందరు సినిమా నటులపై సెటైర్లు వేస్తూనే ఉంది. ఇక నేడు ఆమె తన పేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ పెద్ద సంచలనముగా మారింది. మనమందరం జీవితం అంటే మంచి ఉద్యోగం, చదువు, పెళ్లి, పిల్లలు, ఆస్తులు మరియు డబ్బులు సంపాదించుకోవడం, ఇక మరీ ముఖ్యంగా రేపటి రోజుగురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. అయితే రేపు అనేది ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు, అయితే నా ఒపీనియన్ ప్రకారం దేవుడు మనకు ఇచ్చిన జీవితాన్ని సద్వినియోగం చేసుకుని ఎంతో మర్యాదగా వ్యవహరించడం మంచిది. 


ఇది అయన మనకు ఇచ్చిన అద్భుత వరం, అందుకు దేవుడికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. ఇక పెళ్లి అనేది చేసుకోకండి, దానికి దూరంగా ఉండి, మెడిటేషన్ చేస్తూ ఆధ్యాత్మికత చింతనలో గడిపి, మనలోని అంతరాత్మను తెలుసుకుని తక్కువ బాధతో ఎక్కువ ఆనందంతో జీవించి, చివరకు అలానే మరణించడం బెటర్ అని పోస్ట్ చేసింది. అయితే శ్రీరెడ్డి చేసిన ఈ పోస్ట్ పై కొందరు కామెంట్స్ చేస్తూ, ఇది కేవలం ఆమె వ్యక్తిగత అభిప్రాయమని, ప్రతి ఒక్కరికి ఈ దేశంలో ఎవరి అభిప్రాయాలు వారు వ్యక్తపరిచే హక్కు ఉందని, ఒకరకంగా ఆమె మంచే చెప్పిందని అంటున్నారు. కాగా ఆమె పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: