యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా లైఫ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మాత్రం, బాహుబలికి ముందు అలానే బాహుబలికి తరువాత అనే చెప్పాలి. బాహుబలి సిరీస్ సినిమాలకు ముందు ఆయన నటించిన మిర్చి రూ.40 కోట్లకుపైగా షేర్ వసూలు చేసి, ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ హిట్ గా నిలిచింది. ఇక బాహుబలి రెండు భాగాలు ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేశాయో అందరికి తెలిసిందే. ఇక ఆ రెండు సినిమాల విడుదల తరువాత ప్రభాస్ బాలీవుడ్ స్టార్ హీరోల రేంజికి వెళ్ళిపోయాడు. ఇక ప్రస్తుతం అయన హీరోగా నటిస్తున్న సాహో పై అంచనాలు ఊహించలేని స్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ మరియు నేడు విడుదలైన సైకో సయ్యా అనే సాంగ్ టీజర్ కూడా సూపర్బ్ గా ఉందనే చెప్పాలి. 


ఇక రేపు విడుదల సమయానికి సినిమాపై అంచనాలు ఆకాశమే హద్దుగా పెరిగిపోయినా ఆశ్చర్యం లేదు. ఇక సినిమా ఇండస్ట్రీలో వారు ఏవి నమ్మినా నమ్మకపోయినా, కొన్ని సెంటిమెంట్లు మాత్రం తప్పకుండా నమ్ముతూ ఉంటారు. ఇక ఆ విధంగా ప్రభాస్ కు సంబంధించి ఒక అంశాన్ని త్వరలో విడుదల కాబోతున్న సాహోకు ముడిపెడుతున్నారు కొందరు. అదేమిటంటే, గతంలో పూరి జగన్నాథ్, ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన ఏక్ నిరంజన్ సినిమాతో బాలీవుడ్ నటి కంగనా రనావత్ టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అంతకముందు ప్రభాస్, పూరి కాంబినేషన్ లో వచ్చిన బుజ్జిగాడు మంచి సక్సెస్ సాదించించడంతో, ఈ సినిమా కూడా బాగా ఆడుతుందని అందరూ అనుకున్నారు. అయితే ఆ అంచనాలను అందుకోలేక ఆ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. ఇక ఆ సినిమా తరువాత కంగనా కేవలం బాలీవుడ్ కి మాత్రమే పరిమితం అయింది. 


ఇక ప్రస్తుతం ప్రభాస్ తో జతకడుతున్న బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ కు సాహో టాలీవుడ్ కి హీరోయిన్ గా తొలి సినిమా కావడంతో ఆమె పరిస్థితి కూడా ఇలానే అవుతుందా అంటూ కొందరు సోషల్ మీడియా మాధ్యమాల్లో అనుమానం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే అటువంటి వారికి ప్రభాస్ ఫ్యాన్స్ గట్టిగానే సమాధానం ఇస్తున్నారు, నమ్మకాలు ఉండడం అనేది సహజం, కానీ ఏదో ఒకసారి జరిగినదానిని పట్టుకుని, మళ్ళి అలానే జరుగుతుందా అంటూ తమ హీరో సినిమాపై అనుమానాలు వ్యక్తం చేయడం సరైనది కాదని, తప్పకుండా సాహో అందరి అంచనాలు అందుకుని సూపర్ డూపర్ హిట్ కొట్టి శ్రద్ధకు టాలీవుడ్ లో కూడా మంచి పేరు తీసుకువస్తుందని అంటున్నారు. మరి శ్రద్ధా విషయంలో ఏమి జరుగుతుందో తెలియాలంటే మాత్రం, ఆ సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: