సంపూర్ణేష్ బాబు ..... అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీ ని షేక్ చేసిన సంపూర్ణేష్ బాబు తాజాగా కొబ్బరిమట్ట అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు . హృదయ కాలేయం చిత్రాన్ని తీసిన వాళ్లే మళ్ళీ ఈ కొబ్బరిమట్ట చిత్రాన్ని ప్రారంభించారు . హృదయ కాలేయం 2014 లో విడుదలై సంచలనం సృష్టించగా 2015 లో కొబ్బరిమట్ట స్టార్ట్ చేసారు . 


అయితే డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే షూటింగ్ చేస్తూ ఇన్నాళ్లకు పూర్తిచేశారు ఈ చిత్రాన్ని . అంటే దాదాపు నాలుగేళ్లు అన్నమాట . నాలుగేళ్ళ తర్వాత విడుదల అవుతున్న చిత్రం కావడంతో అందునా సంపూ సినిమా కాబట్టి తప్పకుండా అంచనాలు ఉంటాయి . ఈరోజు కొబ్బరిమట్ట సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది . ఈ చిత్రానికి యు బై ఏ సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ సభ్యులు . ఇక ఈనెలలోనే విడుదల  అన్నమాట కొబ్బరిమట్ట .


మరింత సమాచారం తెలుసుకోండి: