మెగాస్టార్ చిరంజీవి తనుయుడు మెగాస్టార్ రామ్ చరణ్ బుల్లితెరకు యాంకర్ గా రానున్నారట. అయితే ఇంతకాలం నటుడిగా, నిర్మాతగా కనిపించిన చెర్రీ ఇప్పుడు యాంకర్ అవతారం ఎత్తనున్నారట. బుల్లితెరకు నాగార్జున, ఎన్టీఆర్, నాని, రానాలనే మన చెర్రీ కూడా యాంకర్ల మారుతున్నారని, ఇంతకాలం బుల్లితెరకు గెస్ట్ గా వచ్చిన చెర్రీ తండ్రి కోసం యాంకర్ రూపంలో అభిమానులకు కనిపించనున్నారని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ప్రచారం జరుగుతుంది. 


అయితే చెర్రీనే నిర్మాతగా, మెగాస్టార్ చిరంజీవి కథనాయకుడిగా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం 'సైరా నరసింహరెడ్డి'. భార‌త‌దేశ తొలి స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొంది. భారీ అంచనాలపైనా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అయితే అక్టోబర్ రెండున గాంధీ జయంతి సందర్బంగా ఈ సినిమాను విడుదల చెయ్యనున్నటు ఇప్పటికే ప్రకటించారు. 


ఈ నేపథ్యంలోనే చెర్రీ సరికొత్త రూపంలో బుల్లితెరకు రానున్నారని, ఒక ప్రోగ్రాంలో యాంకర్ గా చేయనున్నారని సోషల్ మీడియాలో గుస గుసలు వినిపిస్తున్నాయి. సైరా నరసింహ రెడ్డి ప్రేమోషన్స్ కోసం చెర్రీ సరికొత్త రూపంలో కనిపించనున్నారని, ఆ ప్రోగ్రాంలో సైరాలో నటించిన వారిని, రూపొందించిన వారిని ఇంటర్వ్యూ చేస్తారని టాక్. అయితే ఈ ప్రోగ్రాం ఏ ఛానల్ లో ఉండనుంది అనేది మరో ప్రశ్న. తండ్రి బాటలో 'స్టార్ మా'కి వస్తారా లేదా రానాల జెమినికి వస్తారా అనేది చూడాలి. కాగా ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: