టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ అయిన 'అర్జున్ రెడ్డి' సినిమా ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీలో 'కబీర్ సింగ్' గా తెరకెక్కించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్రలో షాహిద్ కపూర్ నటించగా హీరోయిన్ పాత్ర లో కైరా అద్వానీ నటించింది. కేవలం రెండు వారాలలోనే 200 కోట్లు సాధించిన సినిమా గా బాలీవుడ్ ఇండస్ట్రీలో రికార్డు సృష్టించింది.


ఇదిలా ఉండగా తమిళ వెర్షన్ లో హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ బాల దర్శకత్వంలో వర్మ అనే టైటిల్ పేరిట తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న క్రమంలో ఒక షాకింగ్ న్యూస్ కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది.


అదేమిటంటే ఈ సినిమా అవుట్ పుట్ విషయంలో నిర్మాతలు, విక్రమ్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆ వెర్షన్ ని పక్కన పెట్టేసి డైరెక్టర్ ని మార్చి 'ఆదిత్య వర్మ' అనే టైటిల్ తో మరో వెర్షన్ రెడీ చేశారు. ఇటీవల టీజర్ కూడా వదిలారు. మళ్లీ అదే నెగెటివిటీ కంటిన్యూ అయింది. దీంతో విక్రమ్ సినిమాని ఆపేసే ఆలోచనలో ఉన్నట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్. 


మరింత సమాచారం తెలుసుకోండి: