బాహుబలితో సెన్సేషన్స్ క్రియేట్ చేసిన ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమా చేస్తున్నాడు. సుజిత్ డైరక్షన్ లో యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈమధ్య వచ్చిన సినిమా టీజర్ సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది. సాహో ఆగష్టు 15న రిలీజ్ ఫిక్స్ చేశారు.


సాహోతో పాటుగా జిల్ ఫేం రాధాకృష్ణ డైరక్షన్ లో జాన్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఆ సినిమా కూడా యువి బ్యానర్ లోనే వస్తుంది. అది కూడా పిరియాడికల్ లవ్ స్టోరీ అని తెలుస్తుంది. ఇక ఈ రెండు సినిమాల తర్వాత ప్రభాస్ ఓ కన్నడ స్టార్ డైరక్టర్ తో సినిమా చేస్తాడని తెలుస్తుంది. కన్నడలో స్టార్ డైరక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న ఓ దర్శకుడు ప్రభాస్ కోసం ఓ కథ సిద్ధం చేశాడట.


యువి క్రియేషన్స్ వారు విని ఓకే చేయగా ప్రభాస్ కు డైరెక్ట్ గా వినిపించాలని చూస్తున్నారు. ఈ కథ కూడా ఓకే అయితే ప్రభాస్ తో యువి వారు ముచ్చటగా మూడు సినిమాలు పూర్తి చేస్తారు. కన్నడ దర్శకుడు కథ కూడా యూనివర్సల్ అప్పీల్ ఉన్న స్టోరీ అని తెలుస్తుంది. బాహుబలి సినిమాతో నేషనల్ స్టార్ గా మారిన ప్రభాస్ ఇక మీదట అన్ని నేషనల్ రేంజ్ సినిమాలు చేస్తాడని చెప్పొచ్చు.


సాహో కనుక అంచనాలను అందుకుంటే బాలీవుడ్ ఖాన్ సినిమాల రేంజ్ కు ప్రభాస్ సినిమాలు వెళ్లడం గ్యారెంటీ ఇప్పటికే సాహో ప్రీ రిలీజ్ బిజినెస్ అదరగొడుతుండగా ఆఫ్టర్ రిలీజ్ ఈ జోరు కొనసాగడం గ్యారెంటీ అంటున్నారు చిత్రయూనిట్. మరి ప్రభాస్ సాహో ఎలా ఉండబోతుంది అన్న దానికి మరో నెల రోజులు నిరీక్షణ తప్పదని చెప్పాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: