మహేష్ బాబు - అనిల్ రావిపూడి కాంబోలో మొదలైన సరిలేరు నీకెవ్వరూ సినిమా ఇంకా సెట్స్ మీదకి వెళ్ళలేదు కానీ.. అప్పుడే ఆ సినిమాలో ఉండే కామెడీ, యాక్షన్, మహేష్ లుక్ మీద అనేకరకాల వార్తలు సామజిక మాధ్యమాల్లో ప్రచారంలోకి వచ్చేసాయి. సరిలేరు నీకెవ్వరూ సినిమాలో మహేష్ మిలటరీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని తెలిసిన విషయమే.


ఈ సినిమాని అనిల్ రావిపూడి ఎప్పటిలాగే తన పంధాలోనే కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించబోతున్నాడని అంటున్నారు. ఇక ఈ సినిమాలో కాశ్మిర్ అండ్ ట్రైన్ ఎపిసోడ్ లు కీలక పాత్ర పోషించబోతున్నాయంటూ ఇప్పుడొక వార్త ప్రచారంలోకొచ్చింది.


కశ్మిర్ - పాక్ సరిహద్దుల్లో మిలటరీలో పనిచేసే మహేష్ బాబు తన ఊరికి ఆంధ్రాకి రావడానికి ట్రైన్ లో బయలుదేరుతాడట. అయితే కశ్మిర్ టు ఆంధ్రా అంటే చాలా లాంగ్ కాబట్టి.. ఈ ట్రైన్ ఎపిసోడ్ లో అనిల్ రావిపూడి కమెడియన్స్ తో కలిసి హిలేరియస్ కామెడీ అందించాలని ప్లాన్ చేసాడట. ఇక సినిమాలో ఆ ట్రైన్ ఎపిసోడ్ కాస్త లెన్తీగానే ఉండబోతుందనేది లేటెస్ట్ న్యూస్. ఫస్ట్ హాఫ్ లో ఉండబోయే ఈ ట్రైన్ ఎపిసోడ్ లోనే బండ్ల గణేష్ తో పాటు పలువురు కమెడియన్లు కనిపిస్తారట. 


మరింత సమాచారం తెలుసుకోండి: