ఆరు పరాజయాలు తరువాత సాయి తేజ్ ‘చిత్రలహరి’ తిరిగి తేరుకున్నా యంగ్ హీరోలకు పోటీ ఇవ్వగల సినిమాలలో ఇప్పటికీ నటించలేకపోతున్నాడు. నాగార్జున లాంటి టాప్ హీరోకు కొడుకుగా పుట్టినా మూడు సినిమాలు విడుదల చేసి కనీస విజయాన్ని అందుకోలేక అంతర్మధనంలో ఉన్నాడు అఖిల్.

ఇలాంటి పరిస్థుతులలో అఖిల్ కు సాయి ధరమ్ తేజ్ అదృష్టం పై అసహనం ఏర్పడినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం అఖిల్ ప్రస్తుతం నటిస్తున్న నాల్గవ సినిమా వ్యవహారం బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో గీత ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈమూవీ షూటింగ్ కేవలం ఒక్క వారం రోజులు జరిగి ఇప్పుడు పూర్తిగా అటకెక్కేసింది అని వార్తలు వస్తున్నాయి. 

దీనికి కారణం ఈమూవీకి సంబంధించి ఏర్పడిన హీరోయిన్ ఎంపిక గందరగోళం. అఖిల్ తో నటించడానికి టాప్ హీరోయిన్స్ దొరకక దొరికిన చిన్న హీరోయిన్స్ నచ్చకపోవడంతో ఈమూవీ షూటింగ్ ఆగిపోయింది అంటున్నారు. దీనికితోడు బొమ్మరిల్లు భాస్కర్ వ్రాసిన కథ పై కూడ ఎన్నో సందేహాలు రావడంతో ఈమూవీ పనులు తాత్కాలికంగా ఆగిపోయాయి అని అంటున్నారు.

అయితే ఇలాంటి పరాజయాలు ఎదుర్కున్న సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం మైత్రి మూవీస్ నిర్మాణంలో మారుతి దర్శకత్వంలో షూటింగ్ జరుపుకుంటున్న లేటెస్ట్ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతూ ఉండటం ఒక విధంగా అఖిల్ కు షాకింగ్ న్యూస్ గా మారింది అని అంటున్నారు. టాప్ ఫ్యామిలీ అండదండలు ఉండి కూడ అఖిల్ తన కెరియర్ పరంగా ఒక్క అడుగు ముందుకు వేయలేని పరిస్థితిలో అతడు తీవ్ర గందరగోళంలో ఉన్నట్లు టాక్..
 


మరింత సమాచారం తెలుసుకోండి: