టాలీవుడ్ లో నేను శైలజా, నేను లోకల్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న మాలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహానటి’సినిమాలో నటించి తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో ఎంతో మంచి పేరు సంపాదించింది.  ప్రస్తుతం తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో వరుస ఛాన్సులు దక్కించుకుంటున్న కీర్తి సురేష్ త్వరలో బాలీవుడ్ లో కూడా మెరవబోతుంది. ఇక సోగ్గాడే చిన్నినాయనా సినిమాతో ఓ ట్రెండ్ సృష్టించిన కింగ్ నాగార్జున ప్రస్తుతం ‘మన్మధుడు2’సినిమాలో నటిస్తున్నారు. 

ఈ మూవీ తర్వాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సోగ్గాడే చిన్నినాయనా సీక్వెల్ ‘బంగార్రాజు’సినిమాలో నటించబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో నాగార్జున తో పాటు ఆయన తనయుడు అక్కినేని నాగ చైతన్య కూడా నటించబోతున్నారు. నాగార్జున సరసన పూజా హెగ్డేని ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక నాగచైతన్య సరసన కీర్తి సురేష్ నటిస్తుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.


అయితే టీవల కళ్యాణ్ కృష్ణ.. కీర్తి సురేష్ కు ఫైనల్ నేరేషన్ వినిపించాడట. ఈ మూవీలో తన పాత్రకు ఏమాత్రం ప్రాధాన్యత లేదని తెలుసుకున్న కీర్తి సురేష్  బంగార్రాజు మూవీకి కీర్తి నో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.  కళ్యాణ్ కృష్ణ మరో హీరోయిన్ కోసం చూస్తున్నాడట. ఈ మద్య హీరోయిన్ల ఇలాంటి విషయాల్లో హర్ట్ అవడం..మూవీస్ కి గుడ్ బాయ్ చెప్పడం జరుగుతుంది. ఆ మద్య ఓంకార్ తీస్తున్న రాజుగారి గది 3 విషయంలో కూడా తమన్నాకు ఇదే పరిస్థితి ఎదురు కావడం..ఆమె నోచెప్పడం జరిగిందని తెలిసిందే. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: