టాలీవుడ్ లోకి కెరటం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన బాలీవుడ్ మోడల్, నటి రకూల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’మూవీతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది.  వరుసగా తెలుగు సినిమా స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.  అప్పట్లో యంగ్ స్టార్ హీరోలు రకూల్ ని కావాలని తీసుకొనే వారంటే ఎంత సమ్మోహితులను చేసిందో అర్థం చేసుకోవచ్చు. 

ఈ మద్య తెలుగు లో ఛాన్సులు తగ్గడంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.  ప్రస్తుతం కింగ్ నాగార్జున నటిస్తున్న ‘మన్మధుడు 2’సినిమాలో నటిస్తుంది.  ఆ మద్య పూరి జగన్నాధ్ తీసిన పోకిరి సినిమా గుర్తుంది కదా..ఆ సినిమాలో ఆలీ, వేణు మాధవ్ బిచ్చగాళ్ల సంఘానికి పెద్దలు..ఆలీతో కామెడీ కింగ్ బ్రహ్మానందం గొడవ పెట్టుకోవడం, ఆలీ తన బిచ్చగాళ్లను బ్రహ్మిపై ఉసిగొలిపి అల్లరి చేయించడం ఎంతో ఫన్నీగా అనిపిస్తుంది. 

ఇప్పుడు అచ్చం అలాంటి అనుభవమే రకూల్ కి బాంబేలో ఎదురైందట. హోటల్‌ నుంచి బయటకు వచ్చిన రకుల్‌ని కొంతమంది బిచ్చగాళ్ళు చుట్టు ముట్టారు. అంతే వారు చేసిన హంగామా అంతా ఇంతా కాదట..డబ్బులిమ్మని రకూల్ ని ఎక్కడబడితే అక్కడ టచ్ చేయడం, అడగడంతో ఉక్కిరి బిక్కిరి అయ్యిందట ఈ హాట్ బ్యూటీ.  వెంటనే స్థానికులు కల్పించుకొని ఆమెను అక్కడ నుంచి ఎస్కేప్ చేశారట.

మరింత సమాచారం తెలుసుకోండి: