కొద్దిరోజుల్లో తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను అలరించబోతోంది బిగ్ బాస్ సీజన్-3. మరి జరగబోయే సీజన్లో హౌస్ లో సెలబ్రెటీలు మాత్రమే ఉండేటట్లు షో నిర్వాహకులు ఇంటి సభ్యుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మొదటి భాగంలో చాలా సరదాగా అంతా జరిగిపోయిన రెండో సీజన్లో మాత్రం గొడవలు వివాదాలు ఎక్కువైన క్రమంలో ముఖ్యంగా కంటెస్టెంట్ కౌశల్ విషయంలో ఇంటి సభ్యులు అంతా ఒకేసారి తిరగబడిన క్రమంలో చాలా ప్రమాదకర స్థాయికి పరిస్థితి చేరుకుంది.


అయితే దీనిపై గీతామాధురి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. షోలో పోటీదారుల ప్రవర్తనను చూసి వారిని జడ్జ్ చేయకూడదని గీతామాధురి చెప్పింది. షోలో గేమ్ స్ట్రాటజీలు ఉంటాయని, షోలో వారు ఎదుర్కొనే పరిస్థితులను బట్టి ప్రవర్తన మారుతుంటుందని చెప్పుకొచ్చింది.


షోలో ఉన్నట్లుగా రియల్ లైఫ్ లో ఎవరూ కఠినంగా ఉండరని బయట అందరూ కలిసిమెలిసి ఉంటారని షోలో కొన్ని సందర్భాలలో కొట్టుకున్నప్పటికీ అదంతా షో కోసం మాత్రమేనని, షో నుండి బయటకి వచ్చిన తరువాత తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పుకొచ్చింది. తాజాగా జరగబోయే సీజన్ కి యాంకర్ గా నాగార్జున వ్యవహరించబోతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: