టాలీవుడ్ విలక్షణ నటులు మంచు మోహన్ బాబు ఇప్పుడు తనకు చాలా సంతోషంగా ఉందని అంటున్నారు.  అదేంటీ ఆయనకు అంతగా సంతోషం కలిగించే విషయం ఏంటా అని అనుకుంటున్నారు...చాలా కాంగా ఆయన తిరుపతి వెంకన్నను దర్శించుకోవడాలని అనుకోవడం ఏదో ఒక పరిస్థితి వల్ల అది కుదరకపోవడం జరుగుతూ వస్తుందట. నేడు  ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

గత కొంత కాలంగా శ్రీవారిని దర్శించుకోవాలన్న నా కోరిక తీరిందని..ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో మంచి నాయకులని, ఆయన ప్రజల మనిషి అని అన్నారు. ఏపి ప్రజలు ఆయన  పరిపాలన అందిస్తారని మోహన్‌బాబు పేర్కొన్నారు.మోహన్ బాబు వెంటన ఆయన సతీమణి కూడా ఉన్నారు. ఇక ఎన్నికల సమయంలో మోహన్ బాబు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఇప్పుడు ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంతో మోహన్ బాబుకి కీలక పదవి దక్కనుందంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఆయన ఇలాంటి వార్తలపై ఘాటుగా స్పందించి ఇలాంటి పుకార్లు నమ్మోద్దని అంటున్నారు. శనివారం మోహన్ బాబు కుటుంబసభ్యులతో పాటు ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి కుటుంబసభ్యులు, హోం శాఖ మాజీ కార్యదర్శి దుగ్గల్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: