బాలీవుడ్ లో పెద్ద హిట్ అయిన సినిమా. తమిళ్ లో అజిత్ రీమేక్ చేస్తున్న సినిమా పింక్. హిందీలో అమితాబ్ చేసిన పాత్రనే తమిళంలో అజిత్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇదే ఈ సినిమాను తెలుగులో కూడా తీసే ఆలోచన చేస్తున్నారని లేటెస్ట్ న్యూస్. పింక్ సినిమా హక్కులు నిర్మాత దిల్ రాజు దగ్గర వున్నట్లు హాట్ న్యూస్ ఒకటి ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఆయన ఈ సినిమాను తెలుగులో బాలయ్య కీలక పాత్రలో రీమేక్ చేసే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది. 

అమితాబ్, అజిత్ చేసిన ఈ పాత్రకు సీనియర్ హీరోలు బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఎవరైనా బానే వుంటుంది. అయితే దిల్ రాజుకు మనసులో బాలయ్యతో ఓ సినిమా ఎప్పటికైనా చేయాలనే కోరిక వుండిపోయిందట. ఆ కోరిక ఈ సినిమాతో తీర్చుకుంటే ఎలా వుంటుంది? అని ఆలోచనలో ఉన్నాడని సమాచారం.

ఏడాదికి ఆరు సినిమాలు కనీసం చేయాలన్నది దిల్ రాజు ప్లాన్. అందులో భాగంగానే వచ్చే ఏడాది ప్రాజెక్టుల్లో ఈ సినిమాను చేర్చే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. బాలయ్య ఓకె అంటే కనుక పింక్ సినిమా ప్రాజెక్టు స్టార్ట్ అవుతుంది. ఒకవేళ బాలయ్య ఈ సినిమాకు ఓకె అనకపోతే, అప్పుడు మరో ప్రాజెక్టు ఏదయినా బాలయ్యతో చేయాలనే ఆలోచన కూడా దిల్ రాజుకు వున్నట్లు ఫ్రెష్ అప్‌డేట్. ఇక ఇప్పటికే తమిళంలో విడుదల చేసిన అజిత్ పింక్ రీమేక్ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటు సినిమాపై భారీ అంచనాలను పెంచేస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: