ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత ఎన్నికల మూడ్ లోకి వెళ్లి పోయిన నందమూరి బాలకృష్ణ ఆ మూడ్ నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ సినిమాల్లోకి వెళ్లిపోయాడు. ఎన్టీఆర్ బయోపిక్లు రెండు నిరాశపరచడంతో బాలయ్య కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ ఫుల్ కమర్షియల్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ సినిమా తర్వాత బాలయ్య వరుసపెట్టి సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు.
ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం వచ్చిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ పింక్ రీమేక్ లో బాలయ్య నటించే ఛాన్స్ ఉందని ఫిలిం నగర్ టాక్. ఈ సినిమాలో అమితాబ్ చేసిన పాత్రనే బాలయ్య చేసే ఆలోచనలో ఉన్నాడట. ఈ సినిమాను టాలీవుడ్ టాప్ ప్రొడ్యుసర్ దిల్ రాజు నిర్మించే ఆలోచనలో ఉన్నాడట. ఈ సినిమా రీమేక్ హక్కులు కూడా రాజు చేతిలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదే సినిమాని తమిళ్ లో అజిత్ హీరోగా జెర్సి ఫేమ్ శ్రద్ధ శ్రీనాధ్ కీలక పాత్రలో రీమేక్ చేశారు. ఈ సినిమాలో హీరో లాయర్ పాత్రలో ఉంటాడు. బాలయ్య తెరమీద నల్లకోటు వేసి లాయర్ పాత్రలో నటించి 27 ఏళ్ళు అయ్యింది. 1992లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ధర్మక్షేత్రంలో లాయర్ రోల్ చేశాడు.
అప్పట్లో అది ప్లాప్ అయ్యింది. మళ్లీ ఈ సినిమా చేస్తే 27 ఏళ్లకు ఈ పాత్ర చేసినట్లవుతుంది.