వివాదాలకు అత్యంత దూరంగా ఉండే రాజమౌళి అందరి హీరోలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ ఉంటాడు. సూపర్ స్టార్ మహేష్ తీరు కూడా ఇలాగే ఉంటుంది. ఎటువంటి వివాదాలలోకి మహేష్ వెళ్ళాడు. దీనికితోడు మహేష్ రాజమౌళిల మధ్య మంచి సాన్నిహిత్యం కూడా ఉంది. 

అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ‘ఆర్ ఆర్ ఆర్’ తరువాత 2021లో రాజమౌళి మహేష్ తో సినిమా చేస్తాడు అన్న ప్రచారం కూడ ఉంది. ఇలాంటి వీరిద్దరి మధ్య మహేష్ అభిమానులు చిచ్చు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం ఈమధ్య లేటెస్ట్ గా రాజమౌళి చేసిన ట్విట్.

ప్రస్తుతం వ్యక్తిగత పనుల నిమిత్తం అమెరికాలో ఉన్న రాజమౌళి తాను తానా మహాసభల కోసం అమెరికా రాలేదని తాను వేరే పనుల నిమిత్తం అమెరికా వచ్చానని చెపుతూ తానా మాహాసభలు విజయవంతం కావాలని ఆకాంక్షించాడు. ఇప్పుడు ఈ వ్యవహారమే మహేష్ అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగించింది. 

‘మహర్షి’ సినిమా విడుదలై ఘన విజయం సాధించినా ఆసినిమా గురించి రెండు మంచి మాటలు చెపుతూ ట్విట్ చేయడానికి విజయనిర్మల చనిపోతే సానుభూతి తెలుపుతూ ట్విట్ చేయడానికి ఖాళీ లేని రాజమౌళి తనను అతిధిగా పిలవని తానా మహాసభల గురించి ప్రస్తావన తీసుకు వస్తూ ట్విట్ చేయడానికి ఖాళీ ఉందా అంటూ మహేష్ అభిమానులు సెటైర్లతో కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాదు ఈ సంవత్సరం విడుదలైన అనేక సినిమాల గురించి ‘జెర్సీ’ గురించి పట్టించుకున్న రాజమౌళికి ‘మహర్షి’ లాంటి మంచి సినిమా దృష్టికి రాలేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఒక విషయం పై లేదా ఒక సినిమా పై స్పందించే స్వేచ్చ రాజమౌళికి ఉంటుంది అన్న విషయం మరిచి మహేష్ అభిమానులు రాజమౌళిని ట్రోలింగ్ చేయడం ఎంతవరకు సమంజసం అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: