"రెండున్నరేళ్ల కష్టం మా సినిమా. ఒక సినిమాని తెలుగు ప్రేక్షకులు ప్రేమించినట్టుగా మరెవ్వరూ ప్రేమించలేరు’’ అన్నారు నవీన్ పొలిశెట్టి. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’. స్వరూప్రాజ్ దర్శకుడు. రాహుల్ యాదవ్ నక్కా నిర్మాత. ఇటీవలే ఈ చిత్రం విడుదలైంది.
ఈ సందర్భంగా చిత్రబృందం విజయోత్సవాన్ని నిర్వహించింది. నవీన్ మాట్లాడుతూ ‘‘ప్రేక్షకుల నుంచే కాకుండా, పరిశ్రమ నుంచీ ప్రోత్సాహం లభించింది. విజయ్ దేవరకొండ, కె.రాఘవేంద్రరావు అల్లు అర్జున్ లాంటి ప్రముఖలు అభినందించార’’న్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘నవీన్తోనే చేయాలని ఈ కథ రాసుకొన్నా.
దీనికి కొనసాగింపు చిత్రం ఎప్పుడని అంతా అడుగుతున్నారు. మేం ఉన్నంత కాలం ఈ సినిమాకి కొనసాగింపుగా చిత్రాలు వస్తూనే ఉంటాయ’’న్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘మా చిత్రం అన్ని కష్టాల్నీ దాటుకొని మూడో వారం కూడా ప్రదర్శితమవుతుండడం ఆనందంగా ఉంది’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రశాంత్, విశ్వేశ్వర్రావు, సుహాస్, మార్క్ కె.రాబిన్ తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో ఇటువంటి సినిమా రాలేదని పాలురువు కితాబిచ్చారు. విజయ్ దేవరకొండ మా సినిమాకు చాల సపోర్ట్ చేసాడని హీరో తన ఆనందాన్ని వ్యక్తం చేసాడు. ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ చేస్తానని హీరో అభిమానిలకి మాటిచ్చాడు.