నిన్న విజయనిర్మల ఆఖరి కర్మ కార్యక్రమాలకు ఇండస్ట్రీలోని ప్రముఖులు అంతా వచ్చారు. బాలకృష్ణ మురళీమోహన్ లాంటి ప్రముఖులతో పాటు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న అనేకమంది ప్రముఖులు ఈకార్యక్రమానికి వచ్చి ఆమెకు నివాళి అర్పించారు. 

ఈ సందర్భంలో సూపర్ స్టార్ కృష్ణ తన షాక్ నుండి తేరుకుని అక్కడకు వచ్చిన మీడియా వర్గాలతో విజయనిర్మల ఆరోగ్యం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసాడు. విజయనిర్మల చివరి రోజులలో ఆమె అల్జీమర్స్ సమస్యతో బాధపడిందని నాలుగురోజుల క్రితం జరిగిన విషయాలు కూడ ఆమెకు గుర్తు ఉండేవి కావు అంటూ పాతిక సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు మాత్రం ఆమెకు బాగా గుర్తు ఉండేవి అంటూ ఆమెకు వచ్చిన అసలైన వ్యాధిని బయటపెట్టాడు. 

ఆమె మెదడు పక్క నరం బలహీనం కావడం వల్ల ఇది అంతా జరిగింది అంటూ ఆవేదన వ్యక్తపరిచాడు. ఇక గిన్నీసు బుక్ రికార్డులను క్రియేట్ చేసిన విజయనిర్మలకు పద్మభూషణ్ పురస్కారం లభించక పోవడం పై స్పందిస్తూ రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉంటే ఆయనతో తమకు ఉన్న సాన్నిహిత్యం రీత్యా ఖచ్చితంగా విజయనిర్మలకు పద్మ పురస్కారం వచ్చి ఉండేది అంటూ కృష్ణ కామెంట్స్ చేసాడు. 

అంతేకాదు తమ పద్మాలయ భూములకు సంబంధించి రెగ్యుల రైజ్ చేసే విషయంలో అలనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చేసిన సహాయం తమకు ఎప్పటికీ గుర్తు ఉంటుంది అంటూ కామెంట్స్ చేసి రాజశేఖర్ రెడ్డితో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని మరొకసారి గుర్తుకు చేసుకున్నాడు. విజయనిర్మల మరణం రోజున పసిపిల్లవాడిలా ఏడ్చిన కృష్ణ ఆ షాక్ నుండి తేరుకుని నెమ్మదిగా మీడియాతో మాట్లాడే స్థితికి చేరుకోవడం చూసిన వారు మాత్రం కృష్ణ ఆషాక్ నుండి త్వరగానే తేరుకోగలిగాడు అంటూ ఆ కార్యక్రమానికి వచ్చినవారు అభిప్రాయపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: