టాలీవుడ్ లోని దర్శకుల్లో, హీరోను కొంత విభిన్నంగా మాస్ స్టయిల్లో చూపించే దర్శకుడు పూరి జగన్నాథ్.. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాతో టాలీవుడ్ కి సరికొత్త భాష్యాన్ని నేర్పారు పూరి. ఇక ఆ తరువాత అయన దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలు మంచి సక్సెస్ సాధించినప్పటికీ, పోకిరి రేంజిలో మాత్రం హిట్ కాలేదు అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం పూరి జగన్నాథ్, 

రామ్ తో కలిసి ఇస్మార్ట్ శంకర్ సినిమా తీస్తున్నాడు. మంచి మాస్ కథాంశంతో అలరించే కథ, కథనాలతో యాక్షన్ ఎంటెర్టైనెర్ గా  రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవల యూట్యూబ్ లో విడుదలై, ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టింది. రామ్ సరసన స్టన్నింగ్ బ్యూటీస్ నిది అగర్వాల్, నభ నటేష్ హీరోయిన్లుగా నటిస్తుండగా, మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఈరోజు సాయంత్రం వరంగల్ జిల్లా హన్మకొండలో ఎంతో వైభవంగా జరుగనుంది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి నేడు ఒక వార్త మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. అదేమిటంటే, 

ఈ సినిమాలో రామ్ ని దర్శకుడు పూరి, పక్కా ఊర మాస్ స్టయిల్లో చూపించడం జరిగిందని, ఇక సినిమాలో స్క్రీన్ ప్లే ప్రధాన పాత్ర పోషిస్తుందని, యూనిట్ సభ్యులు అనుకున్నట్లు సినిమా కనుక ప్రేక్షకులకు నచ్చితే, మరొక పోకిరి రేంజ్ హిట్ ఖాయమని అంటున్నారు. చాలారోజుల నుండి పూరి, రామ్ ఇద్దరూ కూడా సరైన సక్సెస్ లేక సతమతం అవుతుండడంతో ప్రస్తుతం ఈ సినిమాపై వస్తున్న పాజిటివ్ వైబ్స్ కనుక నిజమై, రేవు విడుదల తరువాత, ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ సాధిస్తే నిజంగా పూరి, రామ్ లు ఇద్దరికీ మంచి బ్రేక్ వచ్చినట్లే. మరి అది ఎంతవరకు జరుగుతుందో తెలియాలంటే ఈ సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: