ఆడై సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న అమలా పాల్ గురించి ప్రస్తుతం కోలీవుడ్‌లో పెద్ద రచ్చ జరుగుతోంది. ఈ సినిమాలో అమలాపాల్ బోల్డ్‌గా నటించడమే ఇందుకు కారణం. మేయాద మాన్ సినిమా ఫేమ్ దర్శకుడు రత్నకుమార్ ఈ సినిమాను రూపొందించాడు. వీజే రమ్య, వివేక్, ప్రసన్న తదితరులు నటించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
ఈ నేపథ్యంలో ఆడై సినిమా ఆడియో ఫంక్షన్‌లో అమలాపాల్ మాట్లాడుతూ.. ఈ సినిమా షూటింగ్‌లో తనకు ఎదురైన అనుభవాలను పంచుకుంది. లేడి ఓరియెంటెడ్ సినిమాలకు సంబంధించిన కథలు ఎక్కువగా విన్నాను. అయితే అవి అంతగా నచ్చలేదు. దీంతో ఇక లాభం లేదని సినీ ఇండస్ట్రీ నుంచి తప్పుకుందామనుకున్నాను. ఆ సమయంలోనే రత్నకుమార్ ఆడై సినిమా కథను వినిపించారు. స్క్రిప్ట్ బాగా నచ్చింది. తన తొమ్మిదేళ్ల సినీ కెరీర్‌లో ఇలాంటి కథను తాను వినలేదని.. స్టోరీ విభిన్నంగా వుండటంతో సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నానని అమలా పాల్ వెల్లడించింది. 


ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ ఇటీవల విడుదలై సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి.  అంతేగాకుండా ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ''ఎ'' సర్టిఫికేట్ ఇచ్చింది. ప్రస్తుతం విడుదలైన ట్రైలర్ వీడియో సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దుస్తులు వేసుకోకుండా నగ్నంగా కనిపించిన టీజర్‌కు భిన్నంగా ఈ ట్రైలర్ వుంది. ఈ ట్రైలర్ వీడియోలో చిన్న విషయానికీ బెట్ కట్టే అమ్మాయిగా అమలాపాల్ కనిపిస్తోంది. 


"మనుషులు పుట్టేటప్పుడు దుస్తులేసుకుని పుట్టారా? అందుచేత మనం వేసుకున్న దుస్తుల్ని మనం తొలగిద్దాం.. మన శరీరం నిజానికి బర్త్ డే డ్రెస్‌లో వుంటుందని" అమలా పాల్ చెప్పే డైలాగ్స్.. ట్రైలర్‌కు హైలైట్‌గా నిలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: