యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో క్రేజ్ మరింత పెంచేలా చిత్రయూనిట్ సినిమాలో ఓ క్రేజీ ఐటం సాంగ్ ప్లాన్ చేశారు. ఈ సాంగ్ లో ముందు బాలీవుడ్ హాట్ భామ కియరా అద్వాని నర్తిస్తుందని వార్తలు వచ్చాయి. కాని ఇప్పుడు ఆమె ప్లేస్ లో శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ప్రభాస్ తో కాలు కదుపుతుందని తెలుస్తుంది. 


బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ నుండి వస్తున్న సాహో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగు, తమిళ, హింది భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్న సాహో సినిమాకు బాలీవుడ్ లో బాగా వర్క్ అవుట్ అయ్యేందుకే అక్కడ వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు.


ఆల్రెడీ సినిమాలో హీరోయిన్ గా శ్రద్ధా కపూర్ ను తీసుకోగా ఇప్పుడు స్పెషల్ సాంగ్ కు కూడా జాక్వెలిన్ నే ప్రిఫర్ చేస్తున్నారట. ఈమధ్య రిలీజైన సాహో టీజర్ చూశాక సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. కచ్చితంగా సాహోతో ప్రభాస్ మరో సంచలనం సృష్టిస్తాడని అంటున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ ఈ సినిమా నిర్మిస్తున్నారు.


ఇక ఈ సినిమాతో పాటుగా పభాస్ తన తర్వాత సినిమా జాన్ మూవీని స్పీడప్ చేశాడు. సాహో ఆగష్టు 15న రిలీజ్ అవుతుండగా జాన్ సినిమాను 2020 సంక్రాంతి బరిలో దించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. జిల్ ఫేం రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్న జాన్ మూవీలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: