సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది మాట్లాడినా పెద్ద సంచలనమే. ఇక ఎప్పటికపుడు విడుదలయ్యే సినిమాలపై తన వ్యక్తిగత అభిప్రాయాలను సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వ్యక్తపరిచే వర్మ, ఇటీవల బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రస్తుతం అత్యద్భుత కలెక్షన్లతో అక్కడ దూసుకుపోతున్న కబీర్ సింగ్ సినిమాను మన బాహుబలిని మించిందని పోలుస్తూ.ఒక పోస్ట్ చేయడం జరిగింది. తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన అర్జున్ రెడ్డి సినిమా ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. 

ఇక ఈ సినిమాను బాలీవుడ్ లో సినీ వన్ స్టూడియోస్ వారు నిర్మించిన కబీర్ సింగ్ సినిమా ఇటీవల విడుదలై ఇప్పటికే రూ.200 కోట్లను దాటి రూ.300 కోట్ల దిశగా పయనిస్తోంది. ఇక ఈ సినిమాపై బాలీవుడ్ లోని పలువురు సినీ ప్రముఖులు సైతం ప్రశంశలు కురిపిస్తున్నారు. ఇక నిన్న రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా ఈ సినిమాపై ప్రశంశలు కురిపించారు. దర్శకుడు సందీప్ రెడ్డి ఎంతో అత్యద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమాలో షాహిద్ మరియు కియారా తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారని, ఇక ఈ సినిమా ఇటీవలి బ్లాక్ బస్టర్ బాహుబలి కంటే ఎంతో పెద్ద విజయం అని అయన అన్నారు. నిజానికి బాహుబలికి పెట్టిన ఖర్చు, 

కబీర్ సింగ్ కంటే 16 రెట్లు ఎక్కువని, అంతేకాక బాహుబలి 2 తీయడానికి రెండేళ్లకుపైగా పడితే, కబీర్ సింగ్ ని కేవలం 6 నెలల్లో దర్శకుడు తీయగలిగాడని, ఆ విధంగా చూసుకుంటే ఇది బాహుబలిని మించిన విజయం అని అయన సంచలన పోస్ట్ చేసారు. ఇక ఈ సినిమా దర్శకుడు సందీప్ తో కలిసి పార్టీ చేసుకుంటున్న ఫోటోలు కూడా అయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడం జరిగింది. ఇకపోతే నిన్నటినుండి వర్మ పోస్టులు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.....!!   


మరింత సమాచారం తెలుసుకోండి: