రియల్ స్టార్ శ్రీహరి కొడుకు మేఘాంష్ హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘రాజ్ దూత్’ మూవీ త్వరలో విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో ఈమూవీ ప్రమోషన్ ను చాలాముందుగానే మొదలుపెట్టారు. 

ఈ నేపధ్యంలో శ్రీహరి భార్య డిస్కోశాంతి ఒక ప్రముఖ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కొడుకు పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. వాస్తవానికి తన కొడుకు హీరోగా ఎంట్రీ ఇవ్వడం తనకు ఏమాత్రం ఇష్టం లేదనీ తనకు నచ్చిన చదువు చదువుకుని మంచి ఉద్యోగం కాని వ్యాపారం కాని చేయమని తాను ఎన్ని సార్లు చెప్పినా తన కొడుకు తన మాట వినలేదు అన్న విషయాన్ని బయట పెట్టింది. 

వాస్తవానికి శ్రీహరికి తన కొడుకుని హీరోగా చూసుకోవాలి అన్న కోరిక ఉందని అందువల్ల శ్రీహరి ఆత్మకు బాధ కలిగించడం తనకు ఇష్టం లేక తన కొడుకు విషయంలో రాజీపడిన సందర్భాన్ని వివరించింది. అయితే తాను మేఘాంష్ ను కన్నాను కాని అతడి తల రాతను మార్చలేను అంటూ విధి ఎలా ఉంటే అలా జరుగుతుంది అన్న వేదాంతం ఆమె మాటలలో స్పష్టంగా కనిపించింది. 

ఫిలిం ఇండస్ట్రీలో మహిళలకు భద్రత లేదు అన్న విషయమై స్పందిస్తూ తాను 900 సినిమాలలో నటించినా తనకు ఎక్కడా వేదింపులు ఎదురుకాలేదు అన్న విషయం చెపుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు డిస్కో శాంతి చేసింది. ఇండస్ట్రీలో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వెంటనే చెప్పుతో కొడితే భయం ఏర్పడి ఎవరు ఎవరి జోలికి రారని అయితే కొందరు అవకాశాల కోసం రాజీ పడటం వల్ల అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అంటూ ఇండస్ట్రీ పై తన అబిప్రాయాన్ని చాల స్పష్టంగా వెల్లడించింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: