2015 లో పెళ్లిచూపులు సినిమాతో హాస్యనటుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా ప్రియదర్శి, తెలంగాణ యాస‌లో మాట్లాడి ఒక్కసారిగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ప్రతి సినిమాలో హాస్యనటుడిగా కనిపించే ప్రియదర్శి కథనాయకుడిగా యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం మల్లేశం.  


ఈ చిత్రంతో తెలుగు ప్రజల నోటా మరోసారి సూపర్ అని అనిపించుకున్నాడ ప్రియదర్శి. ఈ సినిమాలో పక్క తెలంగాణ యువకుడిలా, తల్లి కోసం ఎంతైనా కష్టపడే కొడుకుల మల్లేశం పాత్రలో జీవించేసి, ప్రేక్షకుల చేస్తా ఔరా అనిపించుకున్నాడు. మల్లేశం సినిమాతో మంచి హిట్ అందుకున్న ప్రియదర్శి బైకు ఎవరో దొంగలించారట. ఈ విషయాన్నీ ఆయనే ట్విట్టర్ వేధికగా నెటిజన్లకు కంప్లైంట్ ఇచ్చారు ప్రియదర్శి. 


ప్రియదర్శి తన ట్విట్టర్ ఖాతాలో తన బైక్ పోయిందని ఇలా రాశారు ' ఈ వీడియో నా బైక్ దొంగలించేప్పుడుది! ఇతను బైక్ దొంగలించేప్పుడు అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోండా దొంగిలించాడు 'ఆన్ ప్రొఫషనల్ దొంగ'' అంటూ ట్విట్ చేశాడు.ఈ ట్విట్ కు సందీప్ కిషన్ స్పందించి సంచలన విషయాన్నీ వెల్లడించాడు. 


సందీప్ కిషన్ ట్విట్టర్ లో స్పందిస్తూ ''బైక్ తీసుకెళ్లడం ఇంత సీరియస్ అవుతుంది అనుకోలేదు. 'నీను వీడని నీడని నేనే' సినిమా ప్రేమోషన్ చెయ్యడానికి ప్రియాదర్శి బైక్ ని తీసుకెళ్లం. ప్రియాదర్షి డేట్స్ ఇవ్వనందుకు ఈ పని చేశామని, ఈ బైక్ ప్రేమోషన్స్ లో స్పెషల్ అట్రాక్షన్ అని, ప్రియదర్శి బైక్ నడపటం నాకు బాగా నచ్చింది అని, లవ్ యు దర్శి'' అంటూ సందీప్ కిషన్ ట్విట్ చేసాడు. ఈ ట్విట్ చేసిన నెటిజన్లు 'హమ్మయ్య నిజంగా బైక్ పోయింది అనుకోని బాధపడ్డాం' అని కామెంట్లు పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: