తెలుగు ఇండస్ట్రీలో తక్కువ సమయంలో ఎక్కువ పాపులారిటీ  తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ.  పెళ్లిచూపులు చిత్రంతో హీరోగా మారిన విజయ్ దేవరకొండ తర్వాత ‘అర్జున్ రెడ్డి’చిత్రంతో ఏకంగా స్టార్ హీరోగా మారాడు.  గీతాగోవిందం తో వంద కోట్ల క్లబ్ లో చేరాడు.  ఆ తర్వాత వచ్చిన టాక్సీవాలా కూడా సూపర్ హిట్ అయ్యింది. 


ప్రస్తుతం డీయర్ కామ్రెడ్ చిత్రంలోనటిస్తున్నాడు. తాను నటించే మూవీస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు ఈ యంగ్ హీరో.  విజయ్ దేవరకొండ కొత్త దర్శకులకు నమ్మడంలో చాలా తెలివిగా ఆలోచిస్తాడు. టాలెంట్ ని పసిగట్టడంలో విజయ్ స్టయిలే వేరు. అదే తరహాలో అలోచించి ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న విజయ్  ఇప్పుడు మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ దర్శకులు మరెవరో కాదు ‘దొరసాని’ తెరకెక్కించిన కెవిఆర్.మహేంద్ర.  ఆనంద్ దేవరకొండ - శివాత్మిక రాజశేఖర్ నటించిన ‘దొరసాని’  శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


ఇటీవల ‘దొరసాని’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడితో విజయ్ చాలా సేపు చర్చించాడు.స్క్రిప్ట్ ఫినిష్ చెయ్ అని అఫర్ ఇచ్చేశాడు.  ప్రస్తుతం రౌడీ హీరో క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక డియర్ కామ్రేడ్ ఈ నెల 26న రిలీజ్ కానుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: