బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ - క్వీన్ కంగనా రనౌత్ మధ్య గత మూడు నాలుగు ఏళ్లుగా వివాదాలు నడుస్తోన్న సంగతి తెలిసిందే. 2015 - 16 నుంచి ఈ ఇద్దరి మధ్య గొడవలపై కోర్టులో రచ్చ జరుగుతోంది. ఎక్కడ దొరికితే అక్కడ గిల్లికజ్జాలు ఆడుతోంది. చివరకు హృతిక్ ఫ్యామిలీ విషయాలను కూడా కంగనా వదలటం లేదు. సందులో సడేమియా అన్నట్టుగా కంగనకు సపోర్ట్ గా ఆమె చెల్లి రంగోలి కూడా రంగంలోకి వచ్చి హృతిక్తో పాటు ఆయన ఫ్యామిలీని ఆడేసుకుంటోంది.
ఇదిలా ఉంటే కంగనా వీలు దొరికినప్పుడల్లా హృతిక్ రాకేష్ - రోషన్ పై పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. రీసెంట్ గా హృతిక్ నటించిన సూపర్ 30 సినిమాకు పోటీగా కంగనా తన మెంటల్ హై క్యా (జడ్జిమెంటల్ హై క్యా గా మారింది) రిలీజ్ కి ప్లాన్ చేసింది. చివరకు కంగనతో వివాదం ఎందుకు ? అనుకున్నాడో ఏమో గాని హృతిక్ సినిమాను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.
ఈ సినిమాను వాయిదా వేయడంపై రకరకాల కామెంట్లు కూడా వచ్చినా.. హృతిక్ మాత్రం తన సినిమాను రిలీజ్ చేసేందుకు ఒప్పుకోలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు హృతిక్ కంగనను టార్గెట్గా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అవతలివారు (కంగన) గొడవకు దిగినా తాను మాత్రం వివాదాలకు దూరంగా ఉండేందుకే ప్రయత్నిస్తున్నాని చెప్పాడు. గొడవకు దిగడాన్ని ఎంజాయ్ చేసేందుకు ప్రయత్నించే వారికి తాను ఆ ఛాన్స్ ఇవ్వనని... ఆరేళ్లుగా ఈ సర్కస్ను కొందరు వినోదంగా భావించారని చెప్పాడు.
అలాగే అసలు ఇండియాలో ఓ యువకుడు చట్టపరిధిలో ఆడాళ్లపై పోరాటం సాగించడం అన్నది ఎండింగ్ అన్నదే లేని వ్యవహారం కిందే లెక్క.. అనీ కూడా హృతిక్ చెప్పాడు. దీనిని బట్టి కంగనతో తన పోరాటం కంటిన్యూ అవుతుందనే చెప్పినట్టు తెలుస్తోంది.