‘పెళ్లిచూపులు’ చిత్రంతో మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు ప్రియదర్శి. ఇటీవలే ప్రియదర్శి మెయిన్ రోల్ లో ‘మల్లేశం ’చిత్రం వచ్చింది. తాజాగా ప్రియదర్శ బైక్ దొంగతనానికి గురైంది. కెరీర్ ప్రారంభంలో కమెడియన్గా తెలుగు ప్రేక్షకులను తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు ప్రియదర్శి. తాజాగా ప్రియదర్శి స్నేహితుడి కోసం చేసిన పని ఇప్పుడు అతన్ని విమర్శల బారిన పడేలా చేసింది. ఒక లెక్కన చెప్పాలంటే హైదరాబాద్ పోలీసులను ఫూల్స్ చేశారు. దీంతో కొందరు నెటిజన్లు ఈ ఇద్దరు నటులపై విరుచుకుపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. సందీప్ కిషన్ హీరోగా 'నిను వీడని నీడను నేనే' అనే చిత్రం తెరకెక్కింది.
ఈ వారంలోనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం ప్రమోషన్స్ కోసం సందీప్, ప్రియదర్శిలు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టడమే కాదు..ఏకంగా హైదరాబాద్ పోలీసులను ఫూల్స్ ని చేసినట్లయ్యింది. నిన్న ప్రియదర్శి తన ట్విట్టర్లో ఎవరో అన్ఫ్రొఫెషనల్ దొంగ తన బైక్ను కొట్టేశాడంటూ వీడియో ఒకటి పోస్ట్ చేశాడు. దీంతో మీడియా అసలు ప్రియదర్శి బైక్ కొట్టేసిన దొంగ ఎవరా? అంటూ తమదైన రీతిలో ఆరాలు తీయడం స్టార్ట్ చేశారు. అసలే నటులు..మరి చోరీకి గురైందంటే పోలీసులు ఊరుకుంటారా? వెంటనే లొకేషన్ ఎక్కడో చెప్పాలని అడగడంతో షాక్ అయిన ప్రియదర్శి తన ట్వీట్ ని వెంటనే డిలీట్ చేశారు.
హీరోగా సందీప్ కిషన్ వెంటనే రియాక్ట్ అయి క్షమాపణలు చెప్పాడు. ప్రియదర్శి బైక్ ఎవరో కొట్టేశారని చెప్పడం అంతా అబద్దమట. ప్రియదర్శి తన స్నేహితుడు సందీప్ కిషన్ నటించిన 'నిను వీడను నీడను నేనే' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన బైక్ పోయిందని చెప్పాడు. `నినువీడని నీడను నేనే` చిత్రంలో ఈ బైక్ కనిపిస్తుంది. దీన్ని ఉపయోగించుకుని ప్రమోషన్స్ చేయాలనుకున్నారు. కానీ తీరా ఆ ప్రమోషన్స్ ఇద్దరికీ బెడిసి కొట్టింది. ఇప్పుడు ప్రియదర్శి, సందీప్ కిషన్ వ్యవహారం నాన్న పులి కథలా ఉందంటూ వారిపై మీడియా వర్గాలతో పాటు నెటిజన్స్ కూడా సిరియస్ గా ఉన్నారు.