సాధారణంగా స్టార్ హీరోలు, హీరోయిన్లకు హార్డ్ కోర్ అభిమానులు ఉంటారు.  తమ అభిమాన హీరో, హీరోయిన్ సినిమాలు వస్తున్నాయంటే చాలు వారు చేసే హడావుడి అంతా ఇంతా కాదు.  ఇక కోలీవుడ్ లో అయితే తమ హీరోల గురించి చచ్చేంత ప్రాణం ఇస్తుంటారు..నిజంగానే తమ అభిమాన హీరోని ఏవరైనా కామెంట్ చేస్తే తన్ని తగలేస్తుంటారు. థియేటర్ల వద్ద భారీ కటౌట్లు ఏర్పాటు చేసి పాలాభిషేకాలు చేస్తూ నానా యాగీ చేస్తుంటారు.  కొంత మంది అభిమానులు మాత్రం చాలా గొప్ప పనులు చేసి తమ అభిమాన హీరో మెప్పులు పొందుతుంటారు. 

తాజాగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా వస్తున్న మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’.  ఈ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్ వరంగల్ లోఈ మద్యే అయ్యింది. ఈ సందర్భంగా పూరి తాను ఈ సినిమా ఎంతో కష్టపడి..ఇష్టంతో తీశానని, రామ్ మంచి ఎనర్జిటిక్ హీరో అని అందుకే ఇందులో ఊరమాస్ లుక్ తో కనిపిస్తాడని అన్నారు.  ఈ మద్య రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తుంటే మాస్ డైలాగ్స్, మాస్ లుక్ తో రామ్ అదిరిపోయాడు. ఈ సినిమాకు ఛార్మీ నిర్మాతగా వ్యవహరిస్తుంది.  తాజాగా ఈ సినిమా సక్సెస్ కావాలని సందీప్ అనే అభిమాని తిరుమల మెట్లను మోకాళ్లతో ఎక్కారు. సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు.

సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.  అందులో.. 'డియర్ సందీప్.. నీ వీడియో చూశాను. ఇప్పుడు నీ ఆరోగ్యం బాగానే ఉందని ఆశిస్తున్నా.. నీ ప్రేమ నా హృదయాన్ని తాకింది.. బాధించింది.. షాక్ కి గురి చేసింది. మీరు ఇంత ప్రేమ, అభిమానం నాపై చూపించడానికి అంతగా నేనేం చేశానో అర్ధం కావడం లేదు.
కానీ మీలాంటి వారి కోసం నా గుండె కొట్టుకుంటూనే ఉంటుంది'' అంటూ రాసుకొచ్చాడు. ఇక ఛార్మీ సందీప్ వీడియో షేర్ చేస్తూ.. 'నువ్ నన్ను ఏడిపించేశావ్ సందీప్' అని ఎమోషనల్ అయింది. 


ఆ తిరుమల వేంకటేశ్వరుని వద్దకు తిరుపతి లో మోకాళ్ళతో నడిచి వెళ్లడం జరిగింది... కచ్చితంగా  ఈ సినిమా బ్లాక్ బస్టర్  అయి గత వైభవాన్ని మళ్ళీ మాకు ఇవ్వాలని మనస్పూర్తి కోరుకున్న...మీ సందీప్ అంటూ రిప్లై ఇచ్చాడు. 




మరింత సమాచారం తెలుసుకోండి: