2020 సంక్రాంతికి ఈసారి గట్టి పోటీ వుంటుందని, నాలుగైదు సినిమాలు విడుదలవుతాయని ఇన్నాళ్లూ వినిపించింది. అయితే వీటిల్లో ఓ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నట్లేనని ఫిల్మ్ నగర్ నుంచి అందిన తాజా సమాచారం. నాగార్జున-రమ్యకృష్ణ, నాగచైతన్య కాంబినేషన్ లో ప్లాన్ చేసిన బంగార్రాజు సినిమా సంక్రాంతికి రావడంలేదట.  
ఈ సినిమా ఇంకా స్టార్ట్ కాలేదు. మన్మథుడు 2 తరువాత స్టార్ట్ చేసి సంక్రాంతికి విడుదల చేస్తారని ఇన్నాళ్లు చిత్ర బృందం అన్నారు. కానీ ఈ సినిమాను సంక్రాంతికి కాకుండా, వచ్చే సమ్మర్ కు రెడీ చేయాలని నాగార్జున డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

ఈనెల నుంచి మూడునెలల పాటు నాగార్జున బిగ్ బాస్ 3లో బిజీగా వుంటారు. అలాగే నాగచైతన్య వెంకీమామ, ఆ తరువాత శేఖర్ కమ్ముల సినిమాలతో బిజీగా వుంటారు. అదీకాక సంక్రాంతికి మహేష్, బన్నీ, రజనీ సినిమాలు పక్కాగా రిలీజ్‌కు వున్నాయి. అందుకే అన్ని విధాలా ఆలోచించి, బంగార్రాజు సినిమాను సమ్మర్ కు తీసుకెళ్లాలని నాగ్ డిసైడ్ అయినట్ల ఫ్రెష్ అప్‌డేట్.

అంటే లేట్ గా స్టార్ట్ అయి, లేటుగా విడుదలవుతుందని ఓ క్లారిటీ ఇచ్చారనమాట. ఈ సినిమాకు నాగ్ ఫ్యామిలీకి రెండు హిట్ లు ఇచ్చిన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో నాగ్ సరసన పూజా హెగ్డే, చైతు సరసన కీర్తి సురేష్ నటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.  మరి ఇందులో నిజమెంతుందో తెలియాల్సి ఉంది. అయితే 
మన్మథుడు-2 కీర్తి ఓ గెస్ట్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: